ఈ వారం పలు కంపెనీలు IPOల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈనెల 19 నుంచి 23 వరకు నాలుగు కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ధరల శ్రేణి రూ.269-283, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ రూ.665-701, ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెడ్ రూ.410-432, సనాతన్ టెక్స్టైల్స్ రూ.305-321గా కంపెనీలు నిర్ణయించాయి.
LIC వద్ద గత ఆర్థిక సంవత్సరంలో మెచ్యూర్టీ అయిన అన్క్లెయిమ్డ్ బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మెచ్యూర్టీ బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేయని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నారని వెల్లడించింది. 2022-23 మధ్య కాలంలో 3,73,329 మంది ఉండగా.. వీరికి సంబంధించి రూ.815 కోట్లు నిధులు ఉన్నాయని పేర్కొంది. 2023-24లో రూ.14 లక్షల విలువైన మరణానికి సంబంధించిన అన్క్లెయిమ్డ్ నిధు...
CTR: కార్వేటినగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి లోకనాథం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ చేసిన వారు సైతం ఇందులో పాల్గొనవచ్చని, 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు అర్హులని వివరించారు.
SKLM: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ అర్థ సంవత్సర పరీక్షలు ప్రారంభం కాలున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జిల్లా డీఈవో తవిటినాయుడు ఏర్పాట్లుగా పూర్తి చేసినట్లు తెలిపారు.
BDK: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రోఫైనాన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు ఎంపీడీవో కార్యాలయంలో ఉ. 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన వారిని అర్హులుగా ప్రకటించారు.
SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోవిందమ్మ తెలిపారు. ఈ మేరకు ఇంటర్, ITI , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 19 నుంచి 30 ఏళ్ల వయసు గల యువకులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
➢ మార్చి 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1➢ మార్చి 7: ఇంగ్లీష్ పేపర్-1➢ మార్చి 11: మ్యాథ్స్ పేపర్ 1A, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1➢ మార్చి 13: మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1➢ మార్చి 17: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1➢ మార్చి 19: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
➢ మార్చి 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2➢ మార్చి 10: ఇంగ్లీష్ పేపర్-2➢ మార్చి 12: మ్యాథ్స్ పేపర్-2A, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2➢ మార్చి 15: మ్యాథ్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2➢ మార్చి 18: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2➢ మార్చి 20: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
TG: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
UPI ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1శాతం ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ట్స్రూమెంట్ల(PPI) పైనే ఛార్జీలు ఉంటాయని స్ప...
TG: రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నాగర్కర్నూల్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష రాస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అయినా అభ్యర్థి రేవతి పురిటి నొప్పులతోనే పరీక్ష రాస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు రేవతికి వైద్యం కోసం వైద్య సిబ్బంది, అంబులెన్స్ సిద్ధం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది జులైలో 120.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ సంపద డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ సూచీ వెల్లడించింది. ఇక అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాన సంపద 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది.
దేశీయ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగుతోంది. ఈ వారం ఐదు కంపెనీలు IPOకు రానున్నాయి. ప్రధాన విభాగంలో ట్రాన్స్రైల్ లైటింగ్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్, మమత మెషినరీ, సనాతన్ టెక్స్టైల్ IPOలు ఉన్నాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఈనెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. మరో కంపెనీ వెంటివ్ హాస్పిటాలిటీ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగుస్తుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో 12 కంపెనీల షేర్లు నమోదు కానున్నాయి.&n...
JN: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్2 పరీక్షకు మెుండ్రాయి పరిధిలోని ఓ తండాకు చెందిన భూక్య సునీత పొరపాటు కారణంగా పరీక్ష రాయలేకపోయింది. ఒకపాఠశాలకు బదులు మరొక పాఠశాలకు వెళ్లింది. ఆమెకు ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత.. తన పరీక్ష కేంద్రం కాదని బయటకు పంపించారు. వెంటనే తన పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే గేట్లను మూసేశారు. సిబ్బందిని ప్రాధేయపడినా అనుమతించపొవడంతో సునీత విలపిస్తూ తిరిగి వెళ్లింది.
JN: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్2 పరీక్షకు మెుండ్రాయి పరిధిలోని ఓ తండాకు చెందిన బాలింత భూక్య సునీత పొరపాటు కారణంగా పరీక్ష రాయలేకపోయింది. ఒకపాఠశాలకు బదులు మరొక పాఠశాలకు వెళ్లింది. ఆమెకు ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత.. తన పరీక్ష కేంద్రం కాదని బయటకు పంపించారు. వెంటనే తన పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే గేట్లను మూసేశారు. సిబ్బందిని ప్రాధేయపడినా అనుమతించపొవడంతో సునీత విలపిస్తూ తిరిగి వెళ్లింది.