మోటో G35 5G పేరిట మరో కొత్త ఫోన్ను ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్.. 6.72 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 ప్రొటెక్షన్, 50MP కెమెరా, 5000mah బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6s జెన్-3 ప్రాసెసర్ వంటి ఫ్యూటర్లతో లభిస్తోంది. 4GB+128GB వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది.
క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అడుగుపెట్టబోతుంది. ఈ నెలాఖరులోగా క్విక్ కామర్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ముందుగా బెంగళూరులో సేవలను ప్రారంభించనున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ సేవల కోసం 2వేల ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు చ...
డిస్టెన్స్, ఆన్లైన్లో హైయిర్ ఎడ్యుకేషన్లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. ఈ కోర్సులకు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని తెలిపింది. కోర్సులకు సంబంధించిన అప్డేట్స్ కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఇస్తామని సూచించింది. UGC వెబ్సైట్ ugc.gov.inలో వచ్చే నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని...
VSP: ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా నిర్వహిస్తున్నట్లు శాసనమండలి పూర్వ సభ్యులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఇంతవరకు అతిపెద్ద మేళా బెంగళూరులో నిర్వహించరని, అంతకన్నా పెద్ద మేళా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.78,600 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరగటంతో రూ.72,050గా ఉంది. కాగా, వెండిపై ఏకంగా రూ.4000 పెరగ్గా కిలో వెండి ధర రూ.1,04,000కు చేరింది.
VZM: మైనార్టీ అభ్యర్థులకు DSCలో ఉచిత శిక్షణకు మంగళవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల కార్యనిర్వాహక సంచాలకుడు RS జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైటులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 0866 2970567 నంబరు లేదా కార్యాల యంలో సంప్రదించాలన్నారు.
ప్రకాశం: అద్దంకి సమీపంలోని శింగరకొండలో ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 59 మంది ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మోహనరావు తెలిపారు. మొత్తం 116 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. మేళాలో పలు కంపెనీలకు 59 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ప్రకాశం: ఒంగోలులోని ప్రభుత్వ బాలుల ఐటీఐ కళాశాలలో సోమవారం జరిగిన జాబ్ మేళాకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా, 43 మంది అప్రెంటీస్ శిక్షణకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ అప్రంటీస్ మేళాలో ఐటీఐ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. అప్రంటీస్ షిప్ మేళాను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.
SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ టైం టేబుల్ విడుదల అయింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధికారి పద్మారావు విడుదల చేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
కోనసీమ: రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్( జెకెసి ) ఆధ్వర్యంలో ఈనెల 12న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. టెన్త్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బిటెక్, అర్హతలు కలిగి 30సంవత్సరాలలోపు గల అభ్యర్థులు అర్హులన్నారు.
విజయనగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమో చదివి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈ మేళాలో బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు https:// naipunyam.ap.gov.in వెబ్ సైట్ అప్లై చేసుకోవచ్చు.
నూతనంగా తీసుకువచ్చిన ఏఐ ద్వారా 800 కోట్ల ఫోన్ కాల్స్పై వినియోగదారులను హెచ్చరించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. అంతేకాకుండా 80 కోట్లకు పైగా మోసపూరిత సందేశాలను గుర్తించినట్లు తెలిపింది. తద్వారా స్పామ్ కాల్స్కు సమాధానం చెప్పే వినియోగదారుల సంఖ్య 12 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది. ఈ స్కామర్లు ఎక్కువగా ల్యాండ్లైన్ నుంచే మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించింది.
మదుపర్లకు సెబీ హెచ్చరికలు జారీ చేసింది. అనధికార వైబ్సైట్ల నుంచి అన్లిస్టెడ్ షేర్లను ట్రేడింగ్ చేయవద్దని సూచించింది. వీటి ద్వారా ట్రేడింగ్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అందువల్ల అనధికార సైట్లలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే నిధుల సమీకరణకు, షేర్ల ట్రేడింగ్కు అనుమతి ఉంటుందని చ...
ఈ ఏడాది నవంబర్లో దేశవ్యాప్తంగా 32,08,719 వాహన విక్రయాలు జరిగినట్లు వాహన డీలర్ల సమాఖ్య తెలిపింది. గతేడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.21 శాతం ఎక్కువని పేర్కొంది. పీవీ విభాగంలో వీటి విక్రయాల 3,21,943కి పడిపోయినట్లు వెల్లడించింది. అలాగే రిటైల్ విక్రయాలు మాత్రం పెరిగినట్లు చెప్పింది.