నెల్లూరు వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితా బుధవారం విడుదల చేస్తున్నట్లు DMHO డాక్టర్ పెంచలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఫార్మాసిస్ట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 19వ తేదీలోపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తెలియచేయాలని కోరారు.
AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రీజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ కంపెనీ తన కంప్రెసర్ల తయారీ యూనిట్ను శ్రీసిటీలో నిర్మించనుంది. 75ఎకరాల్లో నిర్మించే ఈ కర్మాగారం ఆగ్నేయా...
SKLM: శ్రీకాకుళంలోని డీఎల్టీసీ-ఐటీఐలో ఈనెల 19న అప్రెంటిస్ మేళా జరగనుందని డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన 25సం.లోపు వయసు కలిగినవారు అర్హులన్నారు.
W.G: నరసాపురం పట్టణంలోని వైఎన్సిలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోక్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 95020 24765 నంబర్ ను సంప్రదించాలని అన్నారు.
ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో జనవరి 8వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి 19 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వుండే యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లాలో 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థుల వివరాలను సరిచేసుకునేందుకు డిసెంబర్ 19 నుంచి 23 వరకు అవకాశం ఉందని డీఈవో వెంకట లక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సదరు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా అభ్యర్థుల పేరు, ఆధార్ చిరునామా, తదితర తప్పులను సరిచేయాలని సూచించారు.
W.G: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో నరసాపురం వైఎన్ కళాశాలలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీ. లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 70 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.
BDK: జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్లో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు కొత్తగూడెం బాబుక్యాంపు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
VZM: విద్యుత్ ఆదాపై విద్యార్థులకు మంగళవారం దాసన్నపేట విద్యుత్ భవనంలో చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. జాతీయ ఇందన పోదుపు వారోత్సవాలలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అదికారులు మాట్లాడుతూ విద్యుత్ ఆదాపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
SKLM: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 28 ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ నెం 63012 75511 సంప్రదించాలన్నారు.
SBI టాప్ మేనేజ్మెంట్ ఫేక్ వీడియోలపై బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు Xలో పోస్టు పెట్టింది. ‘బ్యాంక్ మేనేజ్మెంట్ వ్యక్తులంటూ వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మవద్దు. వీడియోలో చెప్పిన పథకాలతో బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదు. అసాధారణ రాబడి వచ్చే పథకాలను SBI ప్రవేశపెట్టదు. ప్రజలు మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొంది.
దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2006 స్టెనోగ్రాఫర్ పోస్టులకు SSC ఈనెల 10, 11న పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్, ప్రిలిమినరీ ‘కీ’ని SSC విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 16 నుంచి 18లోపు అభ్యంతరాలు తెలియజేయాలి.
ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 13,735 క్లర్క్ పోస్టులకు నోటిషికేషన్ విడులైంది. డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్/ టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
2024లో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని వీడియోలు అత్యధిక వ్యూస్ సంపాదించాయి. వాటిలో దక్షిణ కొరియాకు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్ 15 బిలియన్ వ్యూస్కు పైగా రాబట్టింది. 8 ఏళ్ల కిందట పింక్ ఫాగ్స్ కిడ్స్ ఛానల్ షేర్ చేసిన ఈ వీడియో ఈ ఏడాది దుమ్మురేపింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో లూలూ కిడ్స్ ఛానల్లోని జానీ జానీ ఎస్ పాపా వీడియో (6.98 బిలియన్ వ్యూస్) [...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 24,598 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.92గా ఉంది.