MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రకళ ప్రకటనలో కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17వ తేదీ డెమో క్లాస్ నిర్వహించబడుతుందని తెలిపారు.
NGL: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా నమిలిపాఠశాల నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్కు ముగ్గురు పిల్లలుఎంపికైనట్లు ప్రధానఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక మ్యాన్ హోల్, ఎరువులు లేకుండా కీటకాలను చంపే ఎలక్ట్రోమెష్, ఎల్పీజీ గ్యాస్ లీకేజీని గుర్తించడం, ఎమ్.శ్రీవాణి, ఐ.వైష్ణవి, ఎమ్.శిరీష ఇన్స్పైర్ అవార్డ్సీలో చెప్పారు.
MDK: సమ్మెకు దిగిన కేజీబీవీ బోధన సిబ్బంది స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసి కేజీబీవీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు అల్పాహారం, భోజనం ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనుంది. ఈనెల 18 మధ్యాహ్నం 3 గంటల నుంచి కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా.. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్లకు హాజరుకానున్నారు.
E.G: వృత్తి విద్య (ఒకేషనల్) గ్రూపులకు సంబంధించి ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) నిర్వహిస్తున్న సెంటర్లను జిల్లా ఓజేటీ ఇన్స్ఫెక్షన్ బృందం గురువారం సందర్శించారు. ఎస్ఎన్ఎటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్ఈ, ఈటీ, ఎంఎల్డీ, ఎంపీహెచ్ డబ్ల్యూ (ఫిమేల్) గ్రూపులకు సంబంధించి ఓజేటీ సెంటర్లను క్షుణ్ణంగా పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు.
KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.
KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.
CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర 2 https://chittoor.ap.gov.in వెబ్ సెట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.
CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO కార్యాలయం పేర్కొంది. 10 విభాగాలలో మొత్తం 23 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఇతర 2 https://chittoor.ap.gov.in వెబ్ సెట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 13.
PLD: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గురువారం రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు 80 గుడ్లు మాత్రమే అందించగా రికార్డులో 113 గుడ్లు రాయటంపై ఆమె ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని పద్మావతి హెచ్చరించారు.
ATP: కదిరిలో డిగ్రీ కళాశాల పక్కన ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థలకు రోజు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. STSN డిగ్రీ కాలేజీ వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులకు AISP నాయకులు మద్దతుగా నిలిచారు. నాయకుడు నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TG: గ్రూప్-2 పరీక్షలపై TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను https://www.tspsc.gov.in/ లో పొందుపర్చింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్లు డౌన్లోడ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185, 040-23542187 నంబర్లకు సంప్ర...
కృష్ణా: చాట్రాయి మండలం కోటపాడు ఎంపీయూపీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు భోజనం తిన్న తర్వాత 9 మంది తీవ్ర కడుపునొప్పికి గురయ్యారు. అనంతరం వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త మెంబర్షిప్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ‘ONE BLCK’ పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా సభ్యత్వం పొందాలంటే స్విగ్గీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందాల్సి ఉంటుంది. 3 నెలల ప్లాన్ ధర రూ.299గా ఉంది. ఈ సేవలతో ప్రతి ఫుడ్ ఆర్డర్పై ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారెంటీ, ఇన్స్టామార్ట్లో ఉచిత డెలివరీలు, డైన్అవుట్పై ప్రత...
ATP: ఓబులదేవరచెరువు మండలంలోని గౌనిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగనవాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని ఆదేశించారు.