ASR: రాజవొమ్మంగి స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం రిటైల్ శిక్షణకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు సీడ్ ఏపీ ట్రైనర్ కె.రత్న కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
SKLM: జిల్లాలో రేపు రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించడమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య తెలిపారు. దీనిని ముందుగా పని దినంగా ప్రకటించినప్పటికీ, జల సంఘాల ఎన్నికల దృష్ట్యా రద్దు చేశామన్నారు. ఫిబ్రవరి 2వ శనివారం పని దినంగా ఉంటుందన్నారు.
WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్నఈ పరీక్షలకు 11, 309 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 28 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
VZM: పార్వతీపురంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీలకు, ఎస్సీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభమైంది. పార్వతీపురం భాస్కర కళాశాలలో శుక్రవారం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎండి. గయాజుద్దీన్ ఉచిత కోచింగ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.
NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 17న ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు.
NZB: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకుంటారని ప్రముఖ వైద్యులు భూంరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో నగరంలోని మాణిక్భవన్, గుండారం హైస్కూల్, శంకర్భవన్, ఆర్చిడ్, సెయింట్ జెవియర్స్ స్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షడు పద్మ ...
BOB అనుబంధ బీఓబీ కార్డ్ లిమిటెడ్ మహిళల కోసం కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. తియారా పేరిట లాంఛ్ చేసిన ఈ కార్డు ద్వారా ట్రావెల్, డైనింగ్, లైఫ్స్టైల్కి సంబంధించి పలు ప్రయోజనాలు అందించనుంది. ఈ కార్డు కోసం జాయినింగ్ ఫీజు రూ.2,499+ GST చెల్లించాలి. కార్డు తీసుకున్న 60 రోజుల్లో రూ.25 వేల వరకు లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజుని తిరిగిస్తారు. ఏడాదిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్ష...
జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు గత జూలైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను RRB తాజాగా విడుదల చేసింది. https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
MDK: చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో హిందీ టీజీటీ పోస్ట్ ఖాళీగా ఉందని దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చంద్రకళ కోరారు. హెచ్పీటీ అర్హత ఉండి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 16 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 17V డెమో క్లాస్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
WGL: హసన్పర్తి బాలికల జూనియర్ గురుకుల కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కళాశాలలో మత ప్రచారం చేస్తున్నారని కొంతమంది వ్యక్తులు వేడుకలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కళాశాలలో ప్రతి సంవత్సరం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇందుమతి తెలిపారు. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసం అయిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి బాంబు బెదిరింపు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ.. ఈ-మెయిల్ పంపినట్లు ముంబైలోని ఆర్బీఐ కార్యాలయం వెల్లడించింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్ వచ్చినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
PDPL: నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 17న జిల్లా కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 17న మంగళవారం ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సమీకృత జిల్లా కలెక్టరేట్కు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
KNL: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. గురువారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే హై స్కూల్, కళాశాలను ప్రత్యేకంగా సందర్శించారు. నిబంధన ప్రకారం ప్రభుత్వం అందించే ప్రతి పదార్థాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
తెలంగాణలో విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో LLB, LLM కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ ఆడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరక్టర్ ప్రొ.సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి ఉ.10 నుంచి మధ్యా 12గం వరకు భర్తీ చేస్తారని వెల్లడించారు. ప్రవేశాల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా TGలా సెట్-2024TG PGలా సెట్-2024 ఎంట్రెన్స్లో ఉత్తీర్ణులై ఉండాలి.