కృష్ణా: మల్లవల్లి పారిశ్రామిక వాడలో 400 కంపెనీలు ప్రారంభించడం ఖాయమని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారన్నారు. ఎయిర్ పోర్డు, రైల్వే స్టేషన్, బందరు పోర్టుకు దగ్గరలో ఉన్న ఏకైక పారిశ్రామిక వాడ ఇదేనన్నారు.
PLD: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల సభ్యులు అన్నారు. గురువారం హరితోత్సవం సందర్భంగా ఎస్కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలోనే భారత్లో అడుగుపెట్టబోతుంది. ఢిల్లీలో షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షోరూం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ఢిల్లీలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారట. కాగా, భారత్లో ఎలాన్ మస్క్ రూ.25వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేరు. తాజాగా స్పేస్ ఎక్స్ లోని అంతర్గత వాటా విక్రయించడంతో.. ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరగడంతో.. 439.2 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకటించింది.
ఎన్టీఆర్: మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డొమెస్టిక్ బయోమెట్రిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణకు పది, ఆపైన చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.
అనిల్ అంబానీకి చెందిన ప్రముఖ రిలయన్స్ పవర్ ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యుత్కు సంబంధించి ‘రిలయన్స్ న్యూ ఎనర్జీస్’ అనే పేరుతో ఈ సంస్థను ప్రారంభించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్పై సంస్థ దృష్టి పెడుతోంది. దీనికి సీఈవోగా మయాంక్ బన్సల్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా రాకేశ్ ...
తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం జియో ‘న్యూఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025’ను తీసుకొచ్చింది. రూ.2025తో రిఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడితో రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను వినియోగించుకోవచ్చు. అదనంగా రూ.2150 విలువైన కూపన్లు( రూ.500 ఏజియో, స్విగ్గీలో రూ.150, ఈజ్ మై ట్రిప్లో రూ.1500) పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోట తన కొత్త తరం సెడాన్ కామ్రీని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.48 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు లీటరుకు 25 కి.మీ మైలేజీ, 18 అంగుళాల అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, స్లిమ్ LED ల్యాంప్స్, డైటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫ్యూచర్లతో వస్తుంది.
డెలివరీ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కామర్స్ రంగంలో పని చేసే గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం త్వరలో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు వీరికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు లేవని.. ఇకపై వారికి కూడా పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది వర్కర్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య కోట్ల...
అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో మొట్టమొదటిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరి చరిత్రకెక్కాడు. ఇటీవల స్పేస్ఎక్స్లోని కొంత వాటాను మస్క్ విక్రయించాడు. దీంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగి.. 439.2 బిలియన్ డాలర్లకు చేరకుంది. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది.
వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై మెటా స్పందించింది. సాంకేతిక సమస్యతో తమ యాప్స్ను పలువురు యూజర్లు వినియోగించుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భగా తమ సేవల్లో అంతరాయం నెలకొన్నందుకు యూజర్లకు క్షమాపణలను చెప్పింది.
వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్ సేవల్లో అంతరాయం కలుగుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ మెసేజ్లు వెళ్లడం లేదని, లాగిన్ అవ్వడం లేదని వేలాది మంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. 50వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సన్నద్ధంకావాలని సూచించారు. అలాగే, విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు.