SKLM: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీ రాములు తెలిపారు. INTER , DEGREE,PG పూర్తిచేసి ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9553292734 సంప్రదించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్లో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER, డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్సైడర్ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకుంది. తాజాగా జపాన్కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ వాటాల విలువ సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా.
వచ్చే వారం 11 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ప్రముఖ కంపెనీలు విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ సబ్స్క్రిప్షన్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్వేషనల్ జెమోలాజికల్ ఇన్ట్సిట్యూట్, ధనలక్షి క్రాప్ సైన్స్, జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, పర్పుల్ యూనిల్ సేల్స్, సుప్రీమ్ పెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హైవోల్టేజ్ కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులు సమీకర...
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మాదాడి సులోచన తెలిపారు. కామర్స్లో డిగ్రీ లేదా బీకాం కంప్యూటర్స్ విద్యార్హత కలిగి ఉన్న మహిళ అభ్యర్థుల నుంచి ఈ నెల 12 లోగా దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.
TG: గ్రూప్-2 పరీక్షలను TGPSC ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 డిసెంబర్ 15న, పేపర్-3, పేపర్-4 డిసెంబర్ 16న రెండు సెషన్లలో ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC కార్యదర్శి నవీన్ తెలిపారు.
ప్రైవేటురంగ టెలికాం కంపెనీ VI ప్రీపెయిడ్ యూజర్ల కోసం సూపర్ హీరో ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అర్ధరాత్రి 12 నుంచి మ. 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా పొందవచ్చు. ప్రస్తుతం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచిత డేటా ఇస్తోంది. ఇకపై అదనంగా ఆరు గంటల పాటు ఈ ప్లాన్ అమలు చేయనుంది. రూ.365పైబడి రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఇటీవల ‘బీఈ 6ఈ’ పేరిట ఓ విద్యుత్ కారును మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ‘6ఈ’ కోడ్ను తన విమాన సేవలకు వినియోగిస్తుండటంతో.. ట్రేడ్మార్క్ ఉల్లంఘన జరిగిందంటూ మహీంద్రాపై ఢిల్లీ హైకోర్టులో ఇండిగో కేసు వేసింది. దీంతో ఆ కారు పేరును ‘బీఈ 6’ మార్చాలని నిర్ణయించినట్లు మహీంద్రా సంస్థ పేర్కొంది. అయితే, ‘బీఈ 6ఈ...
ప్రకాశం: త్రిపురాంతకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువులోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వివిధ సంస్కృతి కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.
KMR: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇటీవల స్టెనో, టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి అర్హుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని DLSA కార్యదర్శి నాగరాణి తెలిపారు. శనివారం జరగాల్సిన పరీక్ష అనివార్య కారణాలవల్ల ఈ నెల 21కి వాయిదా వేశామన్నారు. https://kamareddy.dcourts.gov .in/ సంప్రదించాలని సూచించారు.
నెల్లూరు నగరం నవాబ్ పేటలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని ప్రసంగించారు. చదువు, క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జాబ్కు ఎంపికైతే రూ.85,000 జీతం పొందవచ్చు. మొత్తం 110 పోస్టులు ఉన్నాయి. ఈనెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.gicre.inను సంప్రదించాలి.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజ్లో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యు. సాయికుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 120పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC,INTER డిగ్రీ, పూర్తిచేసే 18-35ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులు అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వికరాబాద్: మర్పల్లి మండలం కలోడ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మొగులప్ప ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తెలుగు లెక్చరర్గా ఎంపికయ్యారు. డైట్ ఎంట్రన్స్ కోచింగ్కు డబ్బు లేక అదే ఇన్స్టిట్యూట్లో అటెండర్గా పనిచేస్తూ కోచింగ్ తీసుకున్నారు. జూనియర్ లెక్చరర్కు ప్రిపేర్ అయి తెలుగు లెక్చరర్గా ఎంపికయ్యారు.
VZM: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు.