• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఈనెల 21న జాబ్ మేళా

E.G: యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 21న కొవ్వూరు ఏబీఎన్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. 34 కంపెనీల ప్రతినిధులు ముఖాముఖీ నిర్వహించి 1,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. పది నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 19, 2024 / 05:13 AM IST

ఈ నెల 21న తల్లిదండ్రుల సమావేశం

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 21న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని, దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

December 19, 2024 / 04:40 AM IST

ఈనెల 26 లోగా దరఖాస్తులు చేసుకోండి

MDK: ఐటీఐలో ఉత్తీర్థులైన అభ్యర్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెదక్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 26వ తేదీ లోగా https:/// www.iict.res.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 19, 2024 / 04:26 AM IST

అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియంలో చరిత్ర సబ్జెక్టు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ వేణు ప్రసాద్ తెలిపారు. పీజీలో 55% ఉత్తీర్ణత, నెట్, సెట్, పీహెచ్డీ పట్టా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 20వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలన్నారు.

December 19, 2024 / 04:11 AM IST

ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి

NLG: ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు.

December 19, 2024 / 04:11 AM IST

బ్రిడ్జ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: ప్రభుత్వ ఐటీఐల్లో 60 శాతం మార్కులతో రెండేళ్ల కాల పరిమితి కోర్సులు ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు బ్రిడ్జి కోర్సు 2025-26 కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపల్ M.చందర్ తెలిపారు. బ్రిడ్జి కోర్సుల ప్రవేశాల కోసం డిసెంబర్ 18 నుంచి 2025 జనవరి 30 వరకు ప్రభుత్వ ఐటీఐ, వరంగల్ నందు దరఖాస్తులు అందజేయాలని కోరారు.

December 19, 2024 / 04:04 AM IST

డిప్లొమా విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

December 19, 2024 / 04:00 AM IST

విద్యార్థులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి టికెట్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్‌తోపాటు 10 కిలోల వరకు అదనపు లగేజి తీసుకెళ్లడానికి అవకాశం ఇచ్చింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ ...

December 18, 2024 / 07:02 PM IST

దూరవిద్య MCA బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలు ఖరారు

HYD: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ (ఇయర్ వైజ్) అన్ని సంవత్సరాల బ్యాక్ లాగ్ పరీక్లను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

December 18, 2024 / 06:18 PM IST

దూరవిద్య MCA బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలు ఖరారు

HYD: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జీ.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించే ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ (ఇయర్ వైజ్) అన్ని సంవత్సరాల బ్యాక్ లాగ్ పరీక్లను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

December 18, 2024 / 06:18 PM IST

చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి ఇరానియన్‌ రియాల్‌

ఇరానియల్ రియాల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికా డాలరుతో పోలిస్తే 7.77 లక్షలకు ఇరానియన్ రియాల్ పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సమయంలో డాలరుతో పోలిస్తే.. 7.03 లక్షలుగా ఇరాన్ కరెన్సీ ఉండేది.

December 18, 2024 / 05:54 PM IST

డెడ్‌లైన్‌ పొడిగించిన EPFO

అధిక పింఛన్ వివరాలు సమర్పించేందుకు EPFO మరింత గడువు విధించింది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఉద్యోగుల వేతన వివరాలు అప్‌లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కార్మికశాఖ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇంకా 3.1 లక్షల మంది ఉద్యోగుల అధిక పింఛను దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేసేందుకు ఇదే చివరి గడువు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

December 18, 2024 / 04:49 PM IST

నీట్ యూజీ 2025 కొత్త సిలబస్‌ వచ్చేసింది

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్ష సిలబస్‌ను NMC విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్ష వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

December 18, 2024 / 04:11 PM IST

ఈనెల 20న జిల్లాలో జాబ్ మేళా

KMM: టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 20 ఉ. 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 210 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్, ఐటీఐ. ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18-30 ఏళ్ళు ఉన్నవారు అర్హులన్నారు.

December 18, 2024 / 04:09 PM IST

BREAKING: DSC అభ్యర్థులకు GOOD NEWS

TG: టెట్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల అభ్యర్థుల నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

December 18, 2024 / 04:08 PM IST