దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 289 పాయింట్ల నష్టంతో 81,843 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 24,692 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 84.84గా ఉంది.
ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగింది. వచ్చే ఏడాది కూడా ఈ జోరు కనిపించనుంది. 2025లో IPOకి వచ్చేందుకు 89 కంపెనీలు ప్రణాళిలు చేస్తున్నాయి. ఈ మేరకు సెబీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీలు మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల వరకు సమీకరించనున్నాయి. IPOకి రానున్న ప్రముఖ కంపెనీల్లో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఫ్లిప్కార్ట్, జెప్టో, NSDL, JSW సిమెంట్, హీరో ఫిన్కార్ప్, ఏథర్ ఎనర్జీ ...
WGL: దుగ్గొండి మండలంలోని పీజీతండాలో 120 ఇళ్లు ఉన్నాయి. అందులో 540 జనాభా ఉండగా ప్రతి ఇంటికి ఒక ఎడ్యుకేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా పలు ప్రభుత్వశాఖల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆ గ్రామానికి పీజీతండా అని పేరు వచ్చింది.
WGL: జిల్లాలో గ్రూప్-2 పరీక్ష మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలు వరంగల్ కలెక్టర్ సత్యశారద వెల్లడించారు. జిల్లాలో మొదటి పేపర్ పరీక్షకు 11,310 మంది అభ్యర్థులకు 5, 275 మందితో 46.64 హాజరుశాతం నమోదైంది. 6,035 మంది గైర్హాజరయ్యారు. రెండో పేపరు 5, 245 మందితో 46.37 హాజరుశాతం నమోదైంది. 6,065 మంది గైర్హాజరైనట్లు ఆమె వెల్లడించారు.
KMM: వయస్సు, అర్హతతో సంబంధం లేకుండా పదో తరగతి, ఆ తరువాత ఇంటర్ చదివే అవకాశం ఉన్న ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ కో- ఆర్డినేటర్ అనురాధ సూచించారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశానికి ఈ నెల 16 వరకు అవకాశం ఉందన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 4 ఇంజినీర్ ఉద్యాగాలను భర్తీ చేయనున్నట్లు DMHO డా.రాజశ్రీ తెలిపారు. అభ్యర్థులు B.Tech (CSE/IT/ECE) అర్హత, కనీసం 4 సంవత్సరాల టెక్నికల్ అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 16 నుంచి 23 సాయంత్రం 5 గంటలలోపు DMHO కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు.
మెదక్: గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి, తమ సమస్యలను తెలుపవచ్చునని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరీక్షలకు రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపనట్లుగా కనిపిస్తోంది. ఇవాళ మొదటి రోజు పరీక్షలు జరగగా.. హాజరుశాతం భారీగా తగ్గింది. సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. పేపర్-1కు 46.75 శాతం అభ్యర్థులు హాజరు కాగా.. పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
TG: మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష ముగిసింది. అయితే, పరీక్ష కేంద్రంలోకి ఓ అభ్యర్థి ఫోన్ తీసుకెళ్లాడు. ఎగ్జామ్ రాస్తుండగా చూసిన ఇన్విజిలేటర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రలోకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.
MBNR: గ్రూప్-2 పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని JPNCE కళాశాల పరీక్షా కేంద్రం వద్ద జోన్- 7 డీఐజీ ఎల్.ఏస్.చౌహన్, ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను నేడు పరిశీలించారు. సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.
దేశీయ మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు ఈ నెల భారీగా ఇన్వెస్ట్ చేశారు. 2 వారాల్లో రూ.22,766 కోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. భారత మార్కెట్పై సానుకూల అంచనాల నేపథ్యంలో ఈక్వీటీల్లో పెట్టుబడులు పెరిగినట్లు వెల్లడించాయి. భారత కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలు, పనితీరు, RBI క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించటం.. పెట్టుబడిదారుల నమ్మకం బలపడేలా చేసినట...
ఢిల్లీ యూనివర్సిటీలో 137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, SA 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. 6 పోస్టులు SC, 3 ST, 12 OBC, 4 EWSలకు రిజర్వ్ చేశారు. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈనెల 18 నుంచి www.du.ac.inలో ప్రారంభం కానుంది.
KMM: గ్రూప్ -2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో 85 కేంద్రాలలో 28,101 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు.
బయోకాన్ గ్రూప్ ఛైర్పర్సన్ కిరణ్ మజందార్ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్జీ టాటా పురస్కారం వరించింది. భారత్లో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐఎస్క్యూ వెల్లడించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్క్యూ వార్షిక కాన్ఫరెన్స్-2024లో ఆమెకు ఈ పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. ఈ అవార్డును తనకు ప్రకటించడం పట్ల కిరణ్ సంతోషం వ్యక...
KMR: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని సూచించారు.