AP: రాష్ట్రంలో సమ్మెటివ్-1 పరీక్షల నిర్వహణలో భాగంగా ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 1-5 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈనెల 17న, 6-10 తరగతులకు తిరిగి ఈనెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.