»Twitter Users Are Shocked Elon Musk Brought Another New Rule
TWITTER: ట్విట్టర్ యూజర్లు షాక్..మరో కొత్త రూల్ తెచ్చిన ఎలాన్ మస్క్!
ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ట్విట్టర్(Twitter)ను ఎలాన్ మస్క్(Elon Musk) సొంతం చేసుకున్నప్పటి నుంచి యూజర్లు(Users) ఆందోళన చెందుతున్నారు. కొత్త కొత్త రూల్స్(New Rule) తేవడం వల్ల యూజర్లు మస్క్ పై ఫైర్ అవుతున్నారు. ఎలాన్ మస్క్ కూడా యూజర్లను ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లోనే ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపు, ట్విట్టర్ లోగో మార్పుల్లో అవకతవకలు జరిగాయి. ఆ తర్వాత ఈ మధ్యనే బ్లూటిక్(Blue tick) గోల ఎక్కువయ్యింది. ఎప్పుడూ ట్విట్టర్ పేరు వార్తల్లో నిలిచేలా ఓ కొత్త నిర్ణయం తెరపైకి వస్తోంది.
ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్:
Rolling out next month, this platform will allow media publishers to charge users on a per article basis with one click.
This enables users who would not sign up for a monthly subscription to pay a higher per article price for when they want to read an occasional article.…
తాజాగా ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా ఎలాన్ మస్క్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా వార్తలు చదవాలనుకునేవారు కొండ డబ్బును చెల్లించాల్సి ఉంటుందని, ఆయా డబ్బులు వసూలు చేసుకునేందుకు వార్త సంస్థలకే మస్క్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆర్టికల్ ని బట్టి ధర నిర్ణయించే అధికారాన్ని కల్పిస్తూ ఎలాన్ మస్క్(Elon Musk) ట్వీట్ చేశాడు. ఈ కొత్త విధానం మే 1 నుంచి అమలులోకి రానున్నట్లు మస్క్ వెల్లడించాడు. అయితే సబ్స్క్రిప్షన్ సేవలు పొందుతున్నవారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడ తెలిపాడు. వారికి మాత్రం ఫ్రీగా వార్తలు చదువుకునే వెసులుబాటును మస్క్ కల్పించాడు. ఈ కొత్త ఫీచర్ వల్ల అటు మీడియా, ఇటు యూజర్ ఇద్దరూ లాభాలు పొందుతారని మస్క్ వెల్లడించాడు.