వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. పలుమార్లు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు జరిగాయి. ఆమె తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
వీడియోను చూస్తుంటే ఒక రోజంతా ఆ పనులు చేసినట్లు కనిపిస్తోంది. ధోనీ దగ్గరుండి ఆ భూమిని అంతా చదును చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతున్నది. వీడియో ఆధారంగా ధోనీకి సంబంధించిన వ్యవసాయ భూమి ఎర్ర నేలలు. ఈ నేలలు అత్యంత సారవంతమైనవి. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ భూములు అత్యంత అనుకూలం. పంట ధోనీ వేస్తాడో లేదా తన సిబ్బందితో వేయిస్తాడో చూడాలి.
పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రకెక్కింది. తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అటువంటి విశిష్టత కలిసి దేవాలయంలో మద్యం, మాంసం (Meat) వంటివి నిషేధం. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పోరాడేందుకు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం(Nara Lokesh Yuvagalam) పేరు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్(Nara Lokesh)ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.