ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.
తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.
కర్నాటక ప్రభుత్వం శుక్రవారం ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ముస్లింలకు 4 శాతం(Muslim 4% Reservation) కోటాను రద్దు చేసింది. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల(Reservations) కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇప్పుడు 4 శాతం ఓబీసీ ముస్లిం కోటాను వొక్కలిగాలు, లింగాయత్ల మధ్య విభజించారు. కోటాకు అర్హులైన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీలో 10 శాతం కిందకు చేర్చబడ్డారు.
రాహుల్ గాంధీ(Rahul gandhi) లోక్ సభ సభ్యత్వం రద్దు అంశంపై కాంగ్రెస్ నేతలు(congress leaders) అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఈ అంశంపై సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు(surat court) తీర్పును సవాలు చేయడంతోపాటు మరిన్ని అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుపనున్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ వేటును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పలువు...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ స్కివర్ బ్రంట్(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి అధికారిక రీమేక్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సముద్రకని(samuthirakani) డైరెక్షన్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.