ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గనుల లీజు పొందిన వారిపై కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా గత మూడేళ్లకు వైసీపీ నేతల ఆధ్వర్యంలో మూడే వేల క...
సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. లేదంటే తాను 50 ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై గతంలో ఈడీకి ఫిర్యాదు చేసిన టీకాంగ్రెస్ తాజాగా సీబీఐకి కంప్ల...
తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత(India) జిడిపి(GDP) వృద్ధి అంచనాను డిసెంబర్లో 6.6 శాతం నుంచి 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్(World Bank) సవరించింది. సవాలక్ష బాహ్య పరిస్థితులతో పాటు పెరుగుతున్న రుణ వ్యయాలు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి కారణంగా వినియోగ వృద్ధి కూడా నిరోదానికి గురికావచ్చని అంచనా వేసింది.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
టాలీవుడ్ స్టారో హీరో నాగ చైతన్య(Naga Chaitanya) గురించి యంగ్ హీరోయిన్ దక్ష నాగార్కర్(Daksha Nagarkar) కీలక అంశాలను వెల్లడించింది. బంగార్రాజు చిత్రంలో షూటింగ్లో భాగంగా లిప్, హగ్ సీన్స్ చేసిన తర్వాత చైతన్య తనకు క్షమాపణ చెప్పాడని తెలిపింది. అతను చాలా జెంటిల్ మాన్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.
ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.
పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తన క్రేజీ వీడియోను ఒకటి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని తెలుపుతూ ప్రకటించారు. ఇది చూసిన విజయ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రౌడీ ఫెల్లో మూవీ త్వరలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది.