నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)... రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.
నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన పోవాలని ప్రజలను సూచించారు.
కర్నాటకలో (Karnataka) ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుణుల (Civil Servants) మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వాగ్యుద్ధం నడుస్తుండటంపై ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇద్దరినీ బదలీ చేసి, పోస్ట్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) ప్రభుత్వం (Government).
మద్యంమత్తులో ఉన్నవారు నానా రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యన వీరి ఆగడాలు ఉండేవి. ఇప్పుడు తప్ప తాగి బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడంతో మద్యం సేవించి దాడులకు తెగబడుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, విమానాల్లో మద్యం సేవించి ప్రయాణం చేయవద్దనే నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఓ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ అటెమ్ట్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆమె పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వేధింపుల అంశంపై కాలేజ్ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని..అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నారు.
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు.
రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తండ్రయ్యాడు. తన భార్యకు బుధవారం మగబిడ్డ పుట్టినట్లు ట్విట్టర్ వేదికగా తెలుపుతు అభిమానులతో షేర్ చేశాడు. బ్లెస్ డ్ విత్ బేబీ బాయ్ అంటూ ఆశీర్వదించాలని కోరాడు. ఈ క్రమంలో పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు.
కొన్ని రోజుల్లోనే మిగతా డబ్బు కూడా సర్దుబాటు అయ్యేలా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎందరో మహానుభావులు స్పందించి నిర్వాణ్ కు పునర్జన్మ కల్పిస్తున్నారు. త్వరలోనే నిర్వాణ్ కు వైద్యం అందించనున్నారు. మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు చూస్తే తెలుస్తున్నది.
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఓ ఒపెన్ కాస్ట్ మైన్ కూప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 50 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్...