కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం మిషన్: చాప్టర్ 1. దీనిని తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రొమోలో నటీనటుల పనితీరును గమనించవచ్చు.
ముగ్గురు స్టార్ హీరోలు లుంగీలతో డాన్స్ చేస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం నుంచి సూపర్ వీడియో సాంగ్ యెంటమ్మా(Yentamma) వచ్చేసింది. వీడియోలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కలర్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మ్యూజికల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి మరి.
ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.
బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.
బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.