కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు.
కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది.
ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రేపు(ఏప్రిల్ 12న) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నిర్వహించనున్న దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్(cm kcr) పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్(hyderabad)లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.