కృష్ణా: గుడివాడలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాల్సిన అవసరంపై ఎస్సై నాగరాజు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణ రక్షకంగా ఉంటుందని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన అనేక ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలని సూచించారు.