మేడ్చల్: కూకట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. APలోని తుని నుంచి గంజాయిని తీసుకొచ్చి కూకట్పల్లిలోని ఒక హాస్టల్ గదిలో ఉంచి విక్రయిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 1.109kgల గంజాయి, రెండు స్కూటీలు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.