AP: కర్నూల్ జిల్లా అదోనిలోని ఎన్డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.