ATP: శెట్టూరు మండలం చిన్నంపల్లి సమీపంలో జనార్ధన్ అనే రైతుకు చెందిన దూడపై ఆదివారం తెల్లవారుజామున చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో దూడ చనిపోయింది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.