BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లులోని ముత్యమ్మకాలనీలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధారావత్ గోపి అనే వ్యక్తి తన భార్య సునీతను వేట కొడవలితో నరికి చంపాడని అన్నారు. నిందితుడు భార్యను చంపిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.