కృష్ణా: గన్నవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు.సైకిల్పై రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గన్నవరంలో ముఠా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.