MNCL: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మందమర్రి CI శశిధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన వారిలో రామకృష్ణాపూర్ కు చెందిన గంగాధరి పృద్వితేజ, మంచిర్యాలకు చెందిన ఎస్.కె. గౌసియా ఉన్నారు. వారి వద్ద నుండి 150 గ్రాముల డ్రై గంజాయి రూ. 1,500, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.