• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

April 12, 2026 / 11:11 AM IST

IIAMలో వైభవంగా ముగిసిన ‘పిన్నాకిల్-2026’

VSP: నగరంలోని ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ‘పిన్నాకిల్-2026’ మేనేజ్‌మెంట్, ఐటీ ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలో సంస్థ డీన్ డాక్టర్ ఎస్.పి. రవీంద్ర మాట్లాడుతూ, ఇటువంటి వేడుకలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

April 12, 2026 / 10:49 AM IST

వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా సుంకర లక్ష్మి

కోనసీమ: వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా అమలాపురం మండలంకి చెందిన సుంకర లక్ష్మీ కుమారి నియమితులయ్యారు. తాడేపల్లి లో ఉన్న కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు ఇవాళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ మంత్రి విశ్వరూప్ అభినందించారు.

April 12, 2026 / 10:40 AM IST

‘జనసేన నేతపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

కోనసీమ: కాజులూరు మండలంలో వ్యాపార తగాదా విషయంలో సన్నపు లక్ష్మి అనే మహిళ పట్ల వివక్ష చూపి, దుర్భాషలాడిన జనసేన నేత అన్యం శ్రీరామచంద్రమూర్తిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. బాధితురాలు న్యాయం కోసం ఆశ్రయించగా, ఆమె కులం పేరుతో అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.

April 12, 2026 / 10:40 AM IST

సూళ్లూరుపేట ప్రజలకు డబుల్ ఆఫర్..!

TPT: సూళ్లూరుపేట ప్రజలకు మున్సిపాలిటీ శుభవార్త ప్రకటించింది. పాత బకాయిలపై 50% వడ్డీ రాయితీతో పాటు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు చెల్లింపులపై 5% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ వరకే అమల్లో ఉంటుంది. సెలవు రోజుల్లోనూ పన్నులు చెల్లించుకునే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో చెల్లింపులు చేయవచ్చు.

April 12, 2026 / 10:36 AM IST

కళలకి పుట్టినిల్లు పాలకొల్లు: హీరో

W.G: కళలకు పుట్టినిల్లు పాలకొల్లు అని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

April 12, 2026 / 10:26 AM IST

వేగంగా తుంగభద్ర జలాశయం మరమ్మతులు

ATP: జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయం మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. హోస్పేటలో చివరి క్రెస్ట్ గేటు తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. 33 గేట్లలో ఇప్పటికే 26 అమర్చగా, మిగిలిన 7 గేట్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి నిల్వకు సిద్ధం కానుందన్నారు.

April 12, 2026 / 10:25 AM IST

ఐపీఎల్ బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలి: ఎస్ఎఫ్ఐ

PPM: గుమ్మలక్ష్మీపురంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అనిల్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. క్రికెట్‌ను ఆస్వాదించడమే కాకుండా కొంతమంది బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు కోల్పోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

April 12, 2026 / 10:23 AM IST

ఉపాధి పనుల్లో అక్రమాల వెలుగు..!

అన్నమయ్య: గాలివీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ వెంకటరత్నం హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో ఉపాధి పనుల్లో రూ.17.29 లక్షలు, పంచాయతీరాజ్ పనుల్లో రూ.40 వేల అక్రమాలు గుర్తించగా, ఇప్పటివరకు రూ.55 వేల వసూలు చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

April 12, 2026 / 10:21 AM IST

జిల్లాలో నేడు మాంసం ధరలు ఎలా ఉన్నాయంటే ?

పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ. 120 ఉండగా, స్కిన్ కేజీ రూ. 240-260, స్కిన్ లెస్ రూ. 270-280 వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 900-1000 మధ్య ఉంది. 100 కోడిగుడ్లు రూ. 600లుగా ఉన్నాయి. దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే ధరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

April 12, 2026 / 10:19 AM IST

నేడు కోటవురట్లలో తగ్గిన చికెన్ ధరలు

AKP: కోటవురట్ల పరిసరాల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో చికెన్ ధరలు తగ్గాయి. ఆదివారం మార్కెట్‌లో బ్రాయిలర్ లైవ్ కిలో రూ.130, చికెన్ రూ.230, స్కిన్‌లెస్ రూ.240కు అమ్ముతున్నారు. బండ కోడి ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి గత వారం రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.160కు లభిస్తోంది.

April 12, 2026 / 10:17 AM IST

పాత వేదాయపాలెంలో రూ.5.03 కోట్లతో అభివృద్ధి పనులు

NLR: రూరల్ 22వ డివిజన్ పాత వేదాయపాలెంలో TDP నేత గిరిధర్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధికి రూ.5.03 కోట్లు కేటాయించిందని, MLA శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వందల కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

April 12, 2026 / 10:16 AM IST

తిరుమలలో మహిళ అదృశ్యం

TPT: హైదరాబాద్‌కు చెందిన ఎన్. జానకి (58) శనివారం తిరుమలలో అదృశ్యమైంది. సాయంత్రం దర్శనం ముగించుకుని SKHT వెళ్లే 5358 నంబర్ బస్సు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకిని ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే 8121842103 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

April 12, 2026 / 10:14 AM IST

శ్రీకాకుళం మీదుగా ప్రత్యేక రైళ్లు

SKLM: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా చర్లపల్లి-సంత్రగచి (నం.07517/18) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16, 23, 30వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ రైలు జిల్లాలో శ్రీకాకుళం రోడ్డు, పలాస వంటి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

April 12, 2026 / 10:12 AM IST

విజయవాడలో రేపు జాబ్ మేళా.. అర్హతలివే!

ఎన్టీఆర్: MG రోడ్డులోని పద్మజ సుజుకి కంపెనీలో ఈ నెల 13న కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన 18-30 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,000-25,000 వేతనం ఉంటుంది. మొత్తం 90 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

April 12, 2026 / 10:11 AM IST