ASR: డుంబ్రిగూడ, కొర్రాయి, అరకు, గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించినట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామ సభ తీర్మానాల మేరకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరమ్మతుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఆర్వో, ఎంపీడీవోలతో కలిసి జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల గురించి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నోటిఫికేషన్ల ఆలస్యం, పరిశ్రమల లేమి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదన్నారు.
VZM: దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు ఇవాళ సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలు దిగారు. ఇందులో ఇంఛార్జ్ మినిస్టర్ అనిత, మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు జగదీశ్వరి, నాగమాధవి ఉన్నారు.
ATP: జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్పీఓలు) పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడంపై యంత్రాంగం దృష్టి సారిస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కూడేరు మండలం ముద్దలపురంలోని రైతు నేస్తం ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీని ఆయన సందర్శించారు. మే 1 నుంచి జిల్లాలోని 200కు పైగా ఎఫ్పీఓల ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు.
AKP: అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరించాలని కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో జీఎంఎస్కేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడిపందేలు, ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, జూదం ఎక్కడైనా జరిగితే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు.
BPT: చీరాల టూ టౌన్ సీఐగా శశి కుమార్ బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడతామని, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
KRNL: తుగ్గలి మండలంలో చెరువు తాండాలో రూ.26.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఇవాళ ఎమ్మెల్యే కేయి శ్యాంకుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. గిరిజన తాండాల అభివృద్ధిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షితులై కొందరు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా ఎమ్మెల్యే వారిని ఆహ్వానించారు.
TPT: శెట్టిపల్లి గ్రామంలో శ్రీ చిరాలమ్మ తల్లి 31వ జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో పాటు ఆనందంతో గ్రామస్తులు ఆయనను సన్మానించారు. ఈ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
NLR: వలేటివారిపాలెం మాలకొండ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు మొదటి వెయ్యి రోజులు శిశువు అభివృద్ధికి కీలకమని తెలిపారు. చిన్న పిల్లలకు మొబైల్, TV వినియోగం తగ్గించి, ఆరుబయట ఆటలకు ప్రోత్సహించాలన్నారు.
KDP: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం వేధిస్తున్నాయని AIBSU నేత జగన్ రాథోడ్ ఆరోపించారు. ఇవాళ కలెక్టరేట్లో DROకు వినతిపత్రం సమర్పించారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా, వారి అనారోగ్యాన్ని పట్టించుకోకుండా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని, లక్ష్యాలు పూర్తి చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో బాబ్జి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పార్టీ శ్రేణులకు ఎంతో హర్షణీయమని తెలియజేశారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాగంటి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో గ్రామ సంఘం యానిమేటర్లకు (వీఓఏ) కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని అందజేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,311 మందికి ఈ ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.
CTR: భారత ప్రముఖ వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.
NDL: డోన్ -నంద్యాలకు బస్సులను నడపాలని BJP జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతికి వినతి పత్రాన్ని ఇవాళ అందించారు. ఈ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం 2,3 ఎక్స్ప్రెస్ బస్సులు తిరిగేలా చూడాలన్నారు. బస్టాండ్లో చలివేంద్రాలు, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, జీపీఎస్ లైవ్ లొకేషన్ సదుపాయం కల్పించాలన్నారు.
ATP: CM చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దశమహా విద్య హోమాలు నిర్వహిస్తున్నారు. ఆరవ రోజు నిర్వహించిన చిన్నమస్తా దేవి హోమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ భరత్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.