నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రూ.2.30 కోట్లతో ముఖ ద్వారాలు నిర్మించారు. వీటిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసి ఇవాళ ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తన హయాంలోనే దర్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
అన్నమయ్య: మదనపల్లెకు చెందిన విలేఖర్ గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. గంగాధర్ మృతి పట్ల శుక్రవారం పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని దేవళం వీధిలోని స్వగృహానికి తరలించారు.
KRNL: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన సుమారు రూ. 60 వేల విలువైన చెక్కులను ఇవాళ ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పంచలింగాలలోని తన నివాసంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. అనారోగ్యం, కష్టాల్లో ఉన్న పేదలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
KKD: కిర్లంపూడి మండలం జగపతినగరంలో ఉపాధి హామీ కూలీలకు స్థానిక ఎస్సై జి. సతీష్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు, కాల్స్కు స్పందించవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
SS: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని 9, 10 వార్డుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మశానంపేట మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ATP: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకతపై అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు ఇవాళ జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యత, హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు వల్ల కలిగే ప్రయోజనాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
CTR: గ్రామ సర్వేయర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా చిత్తూరు రెవెన్యూ భవనంలో గ్రామ సచివాలయ సర్వేయర్లు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్త నిల్వల సమస్యలు పరిష్కరించేందుకు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
TPT: తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(NSU) 5వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీజ్ఞి నాథన్ కామకోటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులపతి ఎన్.గోపాలస్వామి అధ్యక్షతన పట్టాలను అందజేశారు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ను శుక్రవారం వారి నివాసంలో నూతనంగా నియమించిన గుత్తి మండల తెలుగు యువత అధ్యక్షులు కిట్ట యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కిట్ట యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు దానికి సహకరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.
KKD: సామర్లకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిలరాజప్ప శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి, అధికారుల ద్వారా వాటికి పరిష్కారాలకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చిన్న రాజప్ప తెలిపారు. అధికారులు సీఎం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు
CTR: రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈనెల 12వ తేదీ జరుగుతుందని ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్థానిక మోడల్ స్కూల్లో హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. మోడల్ స్కూల్లో ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందు పాఠశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
E.G: రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఘన స్వాగతం పలికారు. ఆయనని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్నాతకోత్సవం, పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనున్నారు.
ASR: రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 65 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి సుష్మ తెలిపారు. వీరిలో 37మంది హైరిస్క్తో ఉన్నట్లు గుర్తించామని వీరికి ప్రత్యేక వైద్య సహాయం, మందులు అందజేస్తున్నామన్నారు. గర్భిణులు బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే, పెరట్లో లభించే ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
CTR: పుత్తూరు నూతన SIగా నాగేంద్రబాబు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో నగరి MLA గాలి భాను ప్రకాశ్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పూష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎస్సైకు ఆయన సూచించారు.
NDL: పాఠశాల ఆవరణలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శక్తి టీం సభ్యులు సూచించారు. శుక్రవారం కౌలూరు ప్రాథమిక పాఠశాలలో ఏఎస్పీ ఆదేశాల మేరకు శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ విద్యార్థులకు ‘బ్యాడ్ టచ్’ గురించి వివరించారు. అందరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.