TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద బీజేపీ నేతలు గుండాల గోపీనాథ్ తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
SKLM: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల నుంచి ఈ వంతెన పనులు జరుగుతున్నాయని ఈ వంతెన పనులు నిర్మాణం పూర్తి కానందున పాతపట్నం గేటు వద్ద నిరంతరం ఇబ్బందులు కలుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి.
KRNL: సీఎం చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు రావడం సంతోషంగా ఉందని శనివారం మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. చంద్రబాబుకు అవార్డు రావడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అన్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. బాబు టీంలో పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
E.G: రాబోయే పుష్కరాల దృష్ట్యా వేమగిరి పుష్కర ఘాట్ను సౌత్ జోన్ డీఎస్పీ ఏ. శివ ప్రియ శనివారం పరిశీలించారు. కడియం మండలం ఊదలమ్మ గుడి సమీపంలోని ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లపై సీఐ అల్లు వెంకటేశ్వరరావుతో చర్చించారు. గత పుష్కరాల అనుభవాలను తెలుసుకుని, అవసరమైన చర్యలపై సూచనలు ఇచ్చారు. అనంతరం కడియం పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.
NDL: జిల్లాలో మొత్తం 449 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు 263 గ్రామాల్లో రీ సర్వే పూర్తైందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి చేసిన గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. 5వ విడతలో భాగంగా ఈనెల 15 నుంచి 30 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించామన్నారు.
కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.ఎస్. కుమారీశ్వరన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన రామచంద్రపురం ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్తో కలిసి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
SS: శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పౌర సేవలపై కలెక్టరేట్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 760.59 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ (AMRUT) 1.0 & 2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
విజయనగరం: పోలీసు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. కో-ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన 47 మంది పోలీసు ఉద్యోగుల పిల్లలకు రూ. 2.17లక్షలను మెరిట్ స్కాలర్షిప్స్ను అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి, కోరుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
TPT: పేద పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. తిరుపతి అంబేడ్కర్ స్టడీ సర్కిల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, అభ్యర్థులతో ముచ్చటించారు. మొత్తం 340 మందికి సివిల్స్ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్, 100 మందికి ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి శనివారం యాడికి మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో తాడిపత్రిలోని తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సచివాలయ సేవలపై కూడా చర్చించారు.
CTR: రొంపిచర్ల తెలుగు ప్రాథమిక పాఠశాల శతాబ్ది ఉత్సవం శనివారం అత్యంత వేడుకగా జరిగింది. 1926లో స్థాపితమైన ఈ పాఠశాల వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డివైఈవో ఇందిరా, ఎంఈఓ శ్రీనివాసులు సీనియర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి, పాఠశాల అభివృద్ధిని కొనియాడారు. ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది.
PLD: కొండమోడు వీరమ్మ కాలనీలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు, మజ్జిగ, రాగి జావ తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయట తిరగవద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, పాల్గొన్నారు.
TPT: CMRF చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. వేడిచర్ల గ్రామానికి చెందిన శివరాం సలోమికి రూ. 30,028, జడ్డా జయమ్మకు రూ. 23,920 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అనకాపల్లి: కోటవురట్ల మండలం బోడపాలెం-కొత్తూరు గ్రామంలో శనివారం ఉపాధి పనుల్లో పాల్గొన్న కార్మికరాలు మృతి చెందింది. చెరువు పనుల్లో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వచ్చిన లోకవరపు చింతపల్లి(60) చెరువు పని చేస్తుండగా ఆకస్మికంగా కుప్పకూలిపోయి మృతి చెందింది. ఆమె మృతితో కూలీల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రకాశం: కొండపి మండలం చోడవరం గ్రామంలో శనివారం బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముందుగా గ్రామస్తులు స్వామికి ఘన స్వాగతం పలికారు.