బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయాన్ని గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పిల్లర్స్ పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తితోనే క్రమశిక్షణ, శాంతియుత జీవనం సాధ్యమని, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
KKD: తుని పట్టణంలోని ప్రకాశం రోడ్డుపై ఆంజనేయ స్వామి గుడి వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం పడినప్పుడల్లా ఆ ప్రాంతం మొత్తం చెరువులా తయారవుతోంది. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసిపోవడంతో రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్నాయి. దుర్వాసన వెదజల్లే ఆ నీళ్ళు రోడ్డు మీదుగా పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
KRNL: కోసిగి గ్రామ ప్రత్యేక అధికారిగా వ్యవసాయ అధికారి వరప్రసాద్ నియమితులయ్యారు. గురువారం దొరల కాలనీలో పర్యటించి తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు. అనంతరం బీరప్పగుడ్డి కాలనీలో శ్మశానవాటికకు వెళ్లే దారిలోని డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
NDL: కోవెలకుంట్ల శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతాయని ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా చేపట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వివిధ ప్రాంతాల భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ATP: అనంతపురం జిల్లాకు ట్రైని కలెక్టర్ సుయాష్ కుమార్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు ట్రైనీ కలెక్టర్లను నియమించారు.ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న సుయా ష్ కుమార్ను జిల్లా ట్రైని కలెక్టర్గా నియమించినట్లు తెలిపారు.
E.G: బొమ్మూరు PS పరిధిలోని ప్రధాన కూడళ్లలో బుధవారం SI రమేశ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు SI కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆయన హెచ్చరించారు.
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్యం, మందులు, పరీక్షలు అన్నీ పూర్తిగా ఉచితమని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి స్పష్టం చేశారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రోగులకు సూచించారు. పేద ప్రజలు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
SKLM: పోలాకి మండలం అంపలాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ Z.P హైస్కూల్లో గురువారం శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం గిరిధర్ అన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు: నరసరావుపేట సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 35-40 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టాలపైకి వచ్చిన వ్యక్తిని రైలు ఢీకొన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్ రైలును ఆపి పరిశీలించగా అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు.
KRNL: జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకరన్ పనితీరును ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడం అవసరమన్నారు. అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తే మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన బలోపేతంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
KDP: ప్రొద్దటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సైడ్ మునీరాని ఈరోజు ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని మునీరాకి శుభాకాంక్షలు తెలిపారు.
GNTR: కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారం కింద పాడైన గుడ్లు ఇస్తుండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ఫెర్రర్ చేసిన సేవలను మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి FCRA అనుమతి సాధించి, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేలా కృషి చేశామని పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని లోకేశ్ కొనియాడారు.
AKP: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలమంచిలి ఎంపీపీ రాజాన శేఘ సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జలధార-జల హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. సాగునీటి కాలువల మరమతులు చేయించాలన్నారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.