W.G: తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆకివీడు విచ్చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తవిటి నాయుడు, రవితేజ, వల్లి ఉన్నారు.
AKP: అచ్యుతాపురం కేజీబీవీలో బాలిక మృతి చెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. సంఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఐదుగురిని సస్పెండ్ చేశామన్నారు. కమిటీలో ఎలమంచిలి, కె. కోటపాడు ఎంఈఓలు సూర్యప్రకాష్, ప్రసాద్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిని జెనీమా ఉన్నట్లు తెలిపారు.
KDP: సీఎం చంద్రబాబును నిన్న సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ (AFCOF) ఛైర్మన్ యాటగిరి రాంప్రసాద్ కలిశారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఫెడరేషన్ ప్రస్తుత పరిస్థితులపై చర్చించి వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు కడపలో టీడీపీ అభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు సూచించారని ఆయన తెలిపారు.
KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ఇలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని కాకినాడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగ దుర్గా రావు హెచ్చరించారు. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలో రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించాలని సోమవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి నలుగురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ప్రకాశం: మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
BPT: చీరాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖ నాయకులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నీలం శామ్యూల్ మోజెస్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
AKP: నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం పరిధిలో 9 మండలాలకు సేవలు అందుతున్నాయి. 1982 సంవత్సరంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక శకటం ద్వారా అనకాపల్లి జిల్లాలో ఆరు మండలాలు, అల్లూరు జిల్లాలో మూడు మండలాలకు ఆపద సమయంలో సేవలందిస్తున్నారు. అయితే మరో అగ్నిమాపక శకటం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
KRNL: ఎమ్మిగనూరు సమీపంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. మహబూబ్ భాష సమక్షంలో వసతులు, రికార్డులు, బోధన విధానాలు పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు సిబ్బందిని అభినందించారు. ఇందులో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
NDL: బేతంచెర్ల మండలం రేపల్లె గ్రామానికి ఇవాళ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలిపారు. ముందుగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కోట్ల పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం రేపల్లె గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీలకు వంద శాతం ఉచిత సౌర విద్యుత్ ఏర్పాట్లను ప్రారంభిస్తారన్నారు.
AKP: మునగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తూ మృతి చెందిన వేతన దారుడు రాము కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలో మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపాధ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
SKLM: మందస మండలం ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ సోంపేట జూని యర్ సివిల్ జడ్జి కె. శ్రీనివాసరావు తీర్పు ఇచ్చారని మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సరియా పల్లి ఉపాధ్యాయుడు (2020లో) మెట్ట దామోదరరావుతో అదే గ్రామానికి చెందిన గస్యా శ్రీనివాసరావు ‘నాడు-నేడు’ పనుల బిల్లుల విషయమై గొడవపడ్డారు.
PLD: అమరావతి మద్దూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రోడ్డులో సీఎం హెలిప్యాడ్ కోసం పరిసరాలను శుభ్రం చేసి, రహదారులను సిద్ధం చేశారు. కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి, భద్రత, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.30 లక్షలతో పైప్లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32వ వార్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో రూ.30.65 లక్షలతో సీసీ రోడ్డు పనులను మొదలుపెట్టామన్నారు.
PPM: జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార’ కార్యక్రమంపై కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జలధార ప్రోగ్రాంకు సంబంధించిన జీవో నంబర్ 10 ప్రకారం మొదటి దశలో 10 రోజుల్లో జూన్ 6 నుంచి 15 తేదీ వరకు క్షేత్రస్థాయిలో పనులను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.