AKP: చోడవరం మండల కేంద్రంలో ఇవాళ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
కృష్ణా: అవనిగడ్డలో రూ.61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ క్యాంటీన్ ప్రారంభిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ అన్న క్యాంటీన్ నిర్మించారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం కానుండటంతో కార్మికులకు మేలు కలుగనుంది.
SKLM: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండల కేంద్రంలో పీఎం ఎస్సీ,ఎస్టీ సూర్యఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలోని 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. గ్రూప్-4కు డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-52 ఏళ్లున్న వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందజేయాలని చెప్పుకొచ్చారు.
CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత పాల్గొని బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు.
PLD: జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు రూ. 26.46 కోట్లతో జలధార-జల హారతి పనులకు కలెక్టర్ కృతిక శుక్లా ఆమోదం తెలిపారు. ఈ పనులు 274 సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టనున్నారు. 227 చెరువుల్లో పూడిక తీత, కాల్వల పునరుద్ధరణతో భూగర్భ జల మట్టం 3 నుంచి 6 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని అధికారులు సూచించారు.
E.G: డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలు, నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అంబేద్కర్ సేవలను స్మరించుకుని, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో నడవాలని సంకల్పించారు.
W.G: మండల కేంద్రమైన కాళ్ల మేజర్ పంచాయతీలో మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్ ప్లాంట్ను ప్రారంభించారు. దీని ఏర్పాటు చేసేందుకు దాత సంధ్యా మెరీన్ సహకారం అందించినట్టు తెలిపారు. స్వచ్చమైన త్రాగు నీరు ప్రతీ గ్రామానికి అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం పీసీ కేశవరావు అధ్యక్షతన సీపీఎం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలు పోరాటాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి శిక్షణ ఇవ్వడం జరిగింది. సోషలిస్ట్ దేశాలు ఆదర్శ పాలన సాగిస్తున్నాయన్నాయి, మనదేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పాలన సాగుతుందన్నారు.
AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో జరుగుతున్న ఎర్ర చెరువు పనులను డూమా పీడీ నిర్మలదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ ఆధారిత హాజరులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి 10 గంటలకు ముగించాలన్నారు. అలాగే, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
KRNL: చంద్రబాబు ఎప్పుడూ అమరావతి గురించే మాట్లాడుతారు తప్ప, వెనుకబడిన ప్రాంతాల గురించి ఎందుకు ఆలోచించరని ఇవాళ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. ‘MAVIGUN’తో కేవలం రూ.10-20వేల కోట్లతో రాజధాని నిర్మించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
PPM: సాలూరు మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. SEWA (షెడ్యూల్డ్ కాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PLD: అమరావతి మండలం ధరణికోటలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీతో లబ్దిదాదులు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతంరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.