పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ డా. ప్రభాకరరె డ్డితో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా తాగునీరు, డ్రైనేజ్ మరియు రహదారుల అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించారు.
BPT: అద్దంకిలోని అత్తలూరు బజారులో వీధి కుక్కల హల్చల్ పెరిగింది. ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసి గాయపరుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వాహనాల వెంటపడుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
NTR: జగ్గయ్యపేటలో డీఎస్ఏ మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ 2026 ఉత్సాహంగా జరిగింది. ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు పోటీపడి ప్రతిభ చూపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేసౌమ్య విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.
PLD: పిడుగురాళ్ల పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ క్రీడలు మొదలయ్యాయి. పలువురు ముఖ్య అతిథులు హాజరై ఈ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని రాణించాలని వారు సూచించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి పలు జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం డీజీపేట గ్రామానికి చెందిన రామ్మూర్తిపై భైరవకోన దేవస్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పూజారిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రామ్మూర్తికి తీవ్ర గాయాలు కావడంతో పామూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు
విశాఖలోని మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. కూటమి పాలనలో రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
TPT: పెళ్లకూరు (మం) చిల్లకూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి కుటుంబానికి ధైర్యం చెప్పారని తెలిపారు. ‘దెబ్బకు దెబ్బే మా సిద్ధాంతం’ అంటూ రాబోయే రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
CTR: డా.బీ.ఆర్. అంబేద్కర్ భవనంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ దేశసేవలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.
KDP: రోడ్డు కాంట్రాక్టు పనులు చేసే వారి నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని ఆర్కే వ్యాలీ CI శంకర్ తెలిపారు. వేంపల్లెలో బస్సు ప్రమాద ఘటనపై ఆయన మాట్లాడారు. రోడ్డు పనులు జరుగుతుంటే సూచికలు లేకపోవడం, డ్రైవర్ రోడ్డు మార్జిన్ చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సుకు విద్యుత్ వైర్లు తగలగానే లైన్ ట్రిప్ అవడంతో ప్రమాదం తప్పిందన్నారు.
ELR: బాబు జగ్జివన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఈరోజు పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాడారన్నారు.
KRNL: గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అని ఎమ్మెల్యే కె. ఈ శ్యాం కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తూ, ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలంలో కామేపల్లిలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఆదివారం కిక్కిరిసింది అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తుల రాకతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అన్నమయ్య: మదనపల్లె మాదినకొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక శ్రీరాములు (35) అనే యువకుడు మద్యం సేవించి అడవిలో తన ఎడమ కాలును కొడవలితో నరికేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన నివాసం వద్ద స్వయంగా “మన రాజధాని – మన అమరావతి”అని ముగ్గులు వేసిమద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని కొనియాడారు.
ATP: రేపు జరగనున్న అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ఎంట్రీ పాస్ ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తామని, మొబైల్ ఫోన్లు అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. భద్రత దృష్ట్యా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఆడిటోరియంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ వేడుకలో 40,782 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వీసీ సుదర్శన్ రావు తెలిపారు.