VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.
ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోనేరుతో పాటు ఆలయంలో స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో విజయ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.
SKLM: మందస మండలం పెద్దకేసుపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై తల్లి కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఐదు నెలల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి మడియా కృష్ణకుమారి(38), చెల్లి యోగేశ్వరి(15)తో కలిసి నిఖిత (18) జీవనం సాగిస్తోంది. పిడుగు రూపంలో అమ్మ, చెల్లి మృతి చెందడంతో ఒంటరిగా మిగిలిన నిఖిత సోమవారం ఇరువురికి తలకొరివి పెట్టింది.
ప్రకాశం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఆవరణ వద్ద బిల్డింగ్ నిర్మాణ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో కార్మికులు భవన కార్మిక సంక్షేమ బోర్డులో గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు జిల్లా కార్యదర్శి షేక్ అన్వర్ భాష అందజేశారు.
KRNL: కోడుమూరులోని మెయిన్ బజార్లో చేనేత కార్మికుడు బండ చంద్రశేఖర్ ఇంటి మట్టి మిద్దె గత రాత్రి కూలిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనలో తల్లి, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఘటన స్థలాన్ని ఇవాళ పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేసి ఇల్లు నిర్మాణం, మగ్గం ఏర్పాటు చేయలన్నారు.
ASR: పాడేరులో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ నిశాంతితో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు జలమట్టాన్ని 1.5 మీటర్లు పెంచాలని ఆమె అధికారులకి సూచించారు. పంచసూత్రాలు అమలుచేస్తూ ప్రతి నీటిబొట్టును కాపాడుకోవాలని, ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
CTR: చిత్తూరు నగరంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.38,51,938 విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఈ చెక్కులను పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
PLD: వరికిపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతులు నేటికీ రాలేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం మాచర్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రాజెక్టుపై సరియైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అటవీ శాఖ అనుమతులు రాగానే అన్ని అనుమతులు వచ్చాయని అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు.
ప్రకాశం: పుల్లలచేరువులో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గ్రామంలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
W.G: పాలకోడేరు(మం) గరగపర్రు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేసే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు అధికారులు, రైతులు, కూటమి నేతలు ఉన్నారు.
NTR: వీరులపాడు మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.
PPM: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పీజీఆర్ఎస్ సమర్థవంతమైన వేదికని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా PGRS గ్రీవెన్స్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు 88 వినతులు, రెవెన్యూ రెవెన్యూ క్లినిక్కు 25 వినతులు అందాయన్నారు. సమస్యలన్నీ నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.
KDP: బద్వేలులో ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రోడ్డులో టీ తాగి ఇంటికి వెళ్తున్న అల్లూరి వెంకటేశయ్య (70)పై నలుగురు దుండగులు దాడి చేశారు. పాత కక్షలతో దారి కాచి, కట్టెలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడు వేడుకున్నా కనికరం చూపకుండా దారుణంగా హింసించి, ఆయన వద్ద ఉన్న సుమారు రూ.20 వేలు, మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారని బాధితుడు వాపోయాడు.
విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLC సోము వీర్రాజు పాల్గొని జెండా ఆవిష్కరించారు. దేశ రాజకీయాల్లో అవినీతి నిర్మూలన లక్ష్యంగా బీజేపీ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. అలాగే, బీజేపీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను నాయకులకు వివరించారు.
BPT: బాపట్ల పట్టణంలోని 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాపట్ల బాలవనం’ను జిల్లా ఇంచార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పార్కును రూపొందించామని తెలిపారు.