కోనసీమ: ఈస్టర్ వేడుకలు మండపేటలో ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు తమ ఆత్మీయ మృతుల సమాధులు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. బైబిల్ ప్రకారం క్రీస్తు మృతి చెందిన తరువాత మూడోవ రోజు సమాధి నుంచి లేవబడతారు. ఆ రోజునే ఈస్టర్ గా క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారు. క్రైస్తవులు సమాధులను కొవ్వొత్తులు, పూలతో సుందరంగా అలంకరించి కుటుంబ సమేతంగా ప్రార్థనలు నిర్వహించారు.
KRNL: కడివెళ్ల గ్రామంలో బిందెడు నీటికి ప్రజలు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటి అందించాలని ఎస్.నాగాలపురం గ్రామం నుంచి పైపులైన్లు వేసినా సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకొకసారి, కొన్ని సార్లు వారం అయినా నీటి సరఫరా జరగడం లేదని, దీంతో గుక్కెడు నీటికి నిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు.
AKP: మునగపాక తహసిల్దార్గా పీవీ రత్నం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి. సత్యనారాయణ రాంబిల్లి తహసీల్దారుగా డిప్యూటేషన్ పై వెళ్లారు. ఈయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన రత్నం మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలపై నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.
KDP: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన వారిని CI నరసింహరాజు ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రజలను సమన్వయం చేస్తూ పోలీసులకు అండగా నిలిచిన MPP ప్రతినిధి సాలబాద్ బుజ్జిని ప్రత్యేకంగా గౌరవించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాసులు, హారిక, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు: తెనాలిలో ఒంగోలు జాతి ఎడ్లబండ్ల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సీనియర్స్ విభాగంలో తెలంగాణ హుజూర్ నగర్కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఎడ్ల జత 3350.03 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. వీటి యజమానికి బుల్లెట్ బైక్ను MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, MLA నక్కా ఆనందబాబు అందజేశారు. ఆర్కే బుల్స్ రాజశేఖర్ జత ఎద్దులు రెండో బహుమతి, అందుకున్నారు.
NLR: కందుకూరు TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్ను ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ ఆవిష్కరించారు. సమాజానికి ముప్పుగా మారిన మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని ఆయన కోరారు. ఈనెల 7న యాంటీ డ్రగ్స్ ప్రచారం కోసం జన చైతన్య జీపు యాత్ర కందుకూరు చేరుకుంటుందని ఫోరం కన్వీనర్ వినోద్ తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.
ASR: ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కే. నర్సయ్య తెలిపారు. గత వారం రోజులుగా నీటి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటర్ ట్యాంక్ను వెంటనే మరమ్మతు చేసి తాగునీరు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.
E.G: దేవీపట్నం మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో గొందూరు పోశమ్మ గండి భక్తులకు ధర్మకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం భారీగా భక్తులు రానున్నందున కొండప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. గండి నుంచి పూడిపల్లి దారిని మూసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాపికొండల పర్యాటకులు సాయంత్రం లోపే తిరిగి రావాలని, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అధికారులు తెలిపారు.
ATP: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డిలో నిర్వహించే వేడుకలకు MLA పరిటాల సునీతను ఆహ్వానించారు. ఎమ్మార్పీఎస్ నేత సుదర్శన్, ఇతర నాయకులు ఆమెను కలిసి ఈ మేరకు విన్నవించారు. బడుగు, బలహీన వర్గాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.
KRNL: పెరుగుతున్న ఎండలతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ ఆలయ సమీపంలో ఓ వానరం వేసవి తాపంతో దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడింది. ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుళాయి వద్దకు వచ్చి కుళాయిని తిప్పి నీరు తాగి దాహం తీర్చుకుంది. అటువైపు వెళుతున్న జనం నీరు తాగుతున్న వానరాన్ని ఆసక్తిగా తిలకించారు.
ELR: ముసునూరు మండలంలోని కూటమి పార్టీ నేతలతో శనివారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలంతా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో తమ తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులకు, సిబ్బందికి సూచించారు.
ప్రకాశం: కందుకూరులో LIC అధికారులను బురిడీ కొట్టించి రూ. 9 లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ SI శివనాగరాజు శనివారం తెలిపారు. LIC ఏజంట్గా శ్రీనివాసులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి 9 లక్షలు కాజేసిన వ్యవహారాన్ని ఆడిట్ అధికారులు గుర్తించారు. దీంతో గతంలో కేసు నమోదైంది. ఆకేసుకు సంబంధించి శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు SI వివరించారు.
VSP: విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ. 40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు.
VSP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ రూ.145, స్కిన్ రూ.260, స్కిన్ లెస్ రూ. 270, శోంఠాం రూ.300లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1000కు, డజన్ గుడ్లు రూ.55లకు అమ్మకాలు చేపట్టారు. అప్పుఘర్, ఎంవీపీ, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చాపల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు.
KDP: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టసభల్లో ఆమోదం లభించిన సందర్భంగా కడప నగరంలోని పాలెంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. MLA మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.