• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

“పీఎం సూర్యఘర్ యోజన ఉత్సవ్” పథకాన్ని ప్రారంభించిన MLA

VZM: బొబ్బిలి మండలం, రాజాచెరువువలస గ్రామంలో ప్రధాన మంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ్ పథకాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అనేది రూ.75,000 కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన పథకమన్నారు.

April 14, 2026 / 01:25 PM IST

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపి

NLR: అంటరానితనం, అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఆశయమని జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఎంపి తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 01:22 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం’

సత్యసాయి: ధర్మవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం తక్షణమే అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 01:15 PM IST

‘అంబేడ్కర్ ఆశయాలు నేటికీ దిక్సూచిగా ఉన్నాయి’

KRNL: అంబేడ్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేశారని జిల్లా SP విక్రాంత్ పాటిల్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి విశేషమని కొనియాడారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలు నేటికీ దిక్సూచిగా ఉన్నాయన్నారు

April 14, 2026 / 01:15 PM IST

ఈ నెల 16 నుంచి 22 వరకు గోవా గవర్నర్ జిల్లా పర్యటన

విజయనగరం జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రత తదితర సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.

April 14, 2026 / 01:10 PM IST

జీవీఎంసీలో అంబేద్కర్ జయంతి

VSP: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కమిషనర్ కేతన్ గార్గ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత ఆయన ఆశయాలని తెలిపారు.

April 14, 2026 / 01:10 PM IST

ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

TPT: పుత్తూరు, నారాయణవనంలో డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడుతూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.

April 14, 2026 / 01:09 PM IST

పోలీస్ సిబ్బందికి యూనిఫామ్‌లను అందచేసిన ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసు సిబ్బందికి దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ యూనిఫామ్‌లను సిబ్బందికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసు సిబ్బంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 01:05 PM IST

48వ వార్డులో అంబేద్క‌ర్ జ‌యంతి

VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో మంగళవారం బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పాల్గొని గ్రామస్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంటరానితన నిర్మూలన, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని తెలిపారు.

April 14, 2026 / 01:04 PM IST

వడమాలపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

TPT: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వడమాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 14, 2026 / 01:03 PM IST

రొంపిచర్ల మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

PLD: రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి కె.పీ. జయన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.

April 14, 2026 / 01:00 PM IST

అమర జవాన్ మురళి నాయక్ త్యాగం వెలకట్టలేనిది: కలెక్టర్

సత్యసాయి: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్ మురళి నాయక్ త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. గోరంట్ల మండలం కల్లితాండాలో నిర్వహించిన ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నివాళులర్పించారు. మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమని, వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 14, 2026 / 12:56 PM IST

ఇంటూరులో పీఎం సూర్యఘర్ ప్రారంభం

BPT: అమృతలూరు మండలం ఇంటూరులో పీఎం సూర్యఘర్ ఎస్సీ, ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకంతో లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. వేమూరు నియోజకవర్గంలో 7,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.

April 14, 2026 / 12:50 PM IST

గుంటూరులో ఆలివ్ సంస్థ హోటల్ గదులు

GNTR: ఏపీ పర్యాటక శాఖతో ఆలివ్ హాస్పిటాలిటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గుంటూరు, విశాఖ, తిరుపతి, విజయవాడల్లో మొత్తం 2,000 హోటల్ గదులను నిర్మించనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 55 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా గుంటూరు సహా ఆయా నగరాల్లో దాదాపు 700 మందికి ఉపాధి లభించనుంది.

April 14, 2026 / 12:50 PM IST

జర్నలిస్టు రాజేశ్‌కు ధర్మాన పరామర్శ

SKLM: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు తాడి రాజేశ్‌ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిస్టులు సమాజానికి అవసరమని పేర్కొంటూ, రాజేశ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

April 14, 2026 / 12:46 PM IST