ATP: తాడిపత్రి మండల పరిధిలోని వెంకటంపల్లి గ్రామ పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. కంకర్ ఫ్యాక్టరీ వద్ద సిలిండర్లు డంపు చేసినట్లు సమాచారం రావడంతో SI కాటయ్య బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 133 డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
SKLM: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాఫూలే 200వ జయంతి వేడుకలను ఈ నెల 11న జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. శనివారం ఉ.10 గం.లకు నగరంలోని పొన్నాడ వంతెన సమీపంలో ఉన్న ఫూలే పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు.
VSP: విశాఖలో గ్యాస్ సిలిండర్ కోసం డెలివరీ బాయ్పై దాడి చేసిన ఘటన లంకెలపాలెంలో జరిగింది. భీమనపల్లి రమణబాబు (50)పై ఇద్దరు ఇనుపరాడ్తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా బుకింగ్ చేస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆటో నుంచి దింపి దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: ఖాజీపేట మండలం ఏటూరు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడు కమలాపురం ప్రాంతానికి చెందిన గండి వెంకటేష్ గుర్తించారు. పని నిమిత్తం మైదుకూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వెంకటేష్ను 108 ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతిచెందిన బొమ్మరాజు చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్నయ్య కుటుంబానికి బుధవారం ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ ఉద్యమం అధ్యక్షుడు పంది మాల్యాద్రి గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు మిత్రలు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
E.G: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకుని ఆపై మోసం చేసిన రాజమండ్రికి చెందిన దవులూరి వినోద్ కుమార్ను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కాకినాడలో మహిళల సాధికారతకై నగర పాలక సంస్థ, మహిళా అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన “రీచ్ మై స్టోర్”ను బుధవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్టోర్లు ఎంతో దోహదపడతాయన్నారు.
కృష్ణా: గన్నవరం మండలం ముస్తాబాదులో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక మాట్లాడారు. పత్రికల విలువలను దిగజార్చి, అసభ్యంగా మాట్లాడే స్థాయికి దిగజారిన ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. మాజీ సీఎం జగన్ కుటుంబంపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
CTR: మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ACB కోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఇకపై ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాస్ పోర్ట్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ. లక్ష డిపాజిట్ చేయాలంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్ ఆంక్షలు సడలిస్తూ న్యాయవాది తీర్పు ఇచ్చారు.
ATP: పుట్లూరు మండలం పి. చింతలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. రామశేఖర్ రెడ్డి అనే రైతు మొక్కజొన్న సాగు కోసం వినియోగించిన పైపులను వేప చెట్టు వద్ద భద్రపరుచుకున్నారు. దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న బాలుడిని ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
SKLM: ఎచ్చెర్లలోని ఉన్న టీటీడీసీ DRDA,SEEDAP సంయుక్తంగా గురువారం ఉపాధి మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ పి. కిరణ్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.18-35 వయస్సు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణలతో బుధవారం రాత్రి కలిసి పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLA మాట్లాడుతూ..గోపాలపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
NDL: గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ CRIF-సేతు బంధన్ పథకం కింద రూ.98 కోట్లతో నిర్మిస్తున్న 4 లేన్ల ROBను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నేతలు కోరిన అండర్పాస్ ప్రతిపాదనపై అంచనాలు సిద్ధం చేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
W.G: వీరవాసరం(M)లోని ఎం. ఆర్.కె జెడ్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం నిర్వహణ తీరుపై సమగ్రంగా పరిశీలించి, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి వారికి కల్పించిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మూల్యాంకన కేంద్రంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు.