• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

KKD: గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండ రామస్వామి, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను వైఖానస ఆగమన ప్రకారం కోటిపల్లి గోదావరి నదిలో జలాధివాసం చేయనున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన రథం అన్నవరం చేరుకోవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి: ఎస్పీ

ATP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ పి. జగదీష్ 169 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పిటిషన్ చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి.

April 13, 2026 / 05:00 PM IST

ఈనెల 15న వారి ఖాతాల్లో రూ.20 వేలు జమ

NLR: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది టీడీపీ మాత్రమేనని, అందుకే మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా నిలబడ్డారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఈ నెల 15న మత్స్యకారులకు రూ.20 వేలు ఖాతాలో జమవుతుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

భూ అక్రమాలపై జేసీకి పరిటాల శ్రీరామ్ వినతి

సత్యసాయి: గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కోరారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

April 13, 2026 / 05:00 PM IST

చెరువు నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల

ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు తూము ద్వారా సాగునీరును మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, రైతులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో రైతుల భూములకు సాగునీరును విడుదల చేశామన్నారు. చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

April 13, 2026 / 04:40 PM IST

శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

April 13, 2026 / 04:39 PM IST

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 04:38 PM IST

నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్టకు వినతిపత్రం అందజేత

NDL: స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని ఏపీ రెడ్డి సంఘం మహిళ అధ్యక్షురాలు సానం రెడ్డి సుహాసిని కోరారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. రాబోయే తరాలకు ఆయన త్యాగం తెలిసేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరభ రెడ్డి, రమణారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:36 PM IST

పరీక్షల్లో ఏల్చూరు విద్యార్థులు ప్రతిభ

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హిందీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన వివిధ స్థాయిల పరీక్షల్లో మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.

April 13, 2026 / 04:32 PM IST

‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి: MRO

కడప: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన ‘మీకోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తొండ MRO మధురవాణి సూచించారు. అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారం కాలేదంటే, వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

April 13, 2026 / 04:31 PM IST

గృహ గణనపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం

AKP: గృహ గణనపై కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఇవాళ ముగిసాయి. మూడవరోజు అవగాహన కోసం కోటవురట్లలో అధికారులు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి గృహ గణన నిర్వహించినట్లు తహసీల్దార్ తిరుమలరావు, మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ కుమార్ తెలిపారు. గృహ యజమానులను అడిగి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు.

April 13, 2026 / 04:30 PM IST

‘వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలి’

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇవాళ శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం మానవజాతి మనుగడకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలన్నారు.

April 13, 2026 / 04:30 PM IST

ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎస్పీ ధీరజ్

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో మదనపల్లిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజల సమస్యలను నేరుగా విని, కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూవివాదాలపై విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

April 13, 2026 / 04:26 PM IST

పెచ్చులూడుతున్న పైకప్పు.. భయాందోళనలో గ్రామస్థులు

KDP: బి.మఠంలోని ప్రభునగర్ అంగన్వాడీ సెంటర్‌లో 28 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంగన్వాడీ టీచర్ లత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్థులు, సిబ్బంది అధికారులను కోరుతున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

April 13, 2026 / 04:25 PM IST

గొల్లపూడిలో మండల TDP సమావేశం

NTR: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ పార్టీ అని, నాయకులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. గొల్లపూడిలోని అయన కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజలకు పేదరికాన్ని దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపటమే సీఎం చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు.

April 13, 2026 / 04:24 PM IST