W.G: ఏపీ మహిళా ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం తణుకులో ఎన్నుకున్నారు. తణుకు NGO సంఘ భవనంలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి అమరావతి ఛైర్పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులుగా కాట్రగడ్డ సుభాషిణి, కార్యదర్శి పిడకల సునీత, కోశాధికారి కోట చంద్రకుమారి, ఉపాధ్యక్షులుగా ఎం.షర్లీ, టి.అనంత ఎన్నికయ్యారు.
పల్నాడు: కారంపూడి మండలం కాకాని వారి పాలెంలో టీడీపీ నాయకుడు జాస్తి గంగారావు కుమారుడి వివాహం జరిగింది. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు మణికంఠ సాయి, గగన రత్నలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ట్యాంకర్ కారుపై పడటంతో BMW కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత, సాంకేతిక కారణాలను తెలుసుకోవడానికి కంపెనీ సాంకేతిక బృందం ఆదివారం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.
గుంటూరు: తెనాలి సమీపంలోని చినరావూరులో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఇంటిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రాంతంలో భయం నెలకొంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో ఇంటి సామగ్రి కాలిపోయింది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించింది.
NLR: నెల్లూరు సంతపేట మార్కెట్లో ఖాళీగా ఉన్న 31 షాపులను కమిషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో శనివారం లీజుదారులకు కేటాయించారు. లీజుదారులు కరెంటు బిల్లులు చెల్లించాలని, కౌన్సిల్ నిర్ణయించిన మేరకు ప్రతి నెలా అద్దె వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
E.G: బీసీలంతా ఎకతాటిపైకి వచ్చి గొప్ప నాయకత్వంగా ఎదగాలని MLA మద్దిపాటి వెంకటరాజు సూచించారు. గోపాలపురంలో జ్యోతి బాఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో MLA మాట్లాడుతూ.. రూ.50 లక్షల విలువల గల జ్యోతి బాపూలే భవనం కడతానని హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ఆశయ సాధనకు బీసీలంతా కృషి చేయాలన్నారు.
SS: కరుడుగట్టిన నేరస్థుడు పసుపులేటి సాయికుమార్పై పీడీ యాక్ట్ అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇతనిపై 43 దొంగతనం కేసులు ఉన్నాయి. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై కన్నతండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న సదరు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి చేరుకోగా నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ అన్నవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అన్నవరం దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.
ASR: గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల కొత్తూరు గ్రామంలో భారీ పాము సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం రాత్రి సమీప అడవి నుంచి సుమారు 15 అడుగుల పొడవైన పాము గ్రామంలోకి ప్రవేశించింది. పాము ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును హతమార్చినట్లు తెలిపారు.
NLR: పిల్లలకు పరీక్షలు పూర్తయి జూన్ 12 వరకు సెలవులు ఉండటంతో ఇంటిపట్టున ఉండే పిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆత్మకూరు ఎస్సై జిలాని శనివారం సూచించారు. పిల్లలు ఇళ్లలో చెప్పకుండా కుంటలు, నది ప్రాంతాలకు వెళ్లి ఈత కొట్టేందుకు వెళ్తుంటారని నీటిలో దిగి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ముందస్తుగానే వారి కదిలికలను గమనించాలని అన్నారు.
VZM: ఈ నెల 15 నుంచి 17 వరకు వంగరలోని 29 గ్రామ పంచాయతీలలో అభివృద్ధి ప్రణాళికపై గ్రామసభలు నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్లు డిప్యూటీ MPDO రామారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టవలసిన పనులు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణపై చర్చించనునట్లు తెలిపారు.
ఎన్టీఆర్: వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు.
NDL: పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు శ్రీకాళహస్తిలో 4 రోజుల పాటు పంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ శనివారంతో ముగిసింది. బండి ఆత్మకూరు మండలంలోని బి.కోడూరు, గాలి చెన్నయ్య పాలెం, సోమయాజుల పల్లె కార్యదర్శులు గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
PPM: జనగణనను కచ్చితత్వంతో నిర్వహించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ సూచించారు. శనివారం గుమ్మలక్ష్మీపురం ZP హైస్కూల్లో MRO శేఖరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్యుమరేటర్స్ శిక్షణ తరగతులను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి సర్వే చేపట్టాలన్నారు.