ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు తూము ద్వారా సాగునీరును మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, రైతులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో రైతుల భూములకు సాగునీరును విడుదల చేశామన్నారు. చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
NDL: స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని ఏపీ రెడ్డి సంఘం మహిళ అధ్యక్షురాలు సానం రెడ్డి సుహాసిని కోరారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. రాబోయే తరాలకు ఆయన త్యాగం తెలిసేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరభ రెడ్డి, రమణారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హిందీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన వివిధ స్థాయిల పరీక్షల్లో మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.
కడప: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన ‘మీకోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తొండ MRO మధురవాణి సూచించారు. అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారం కాలేదంటే, వాటి స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చన్నారు. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
AKP: గృహ గణనపై కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఇవాళ ముగిసాయి. మూడవరోజు అవగాహన కోసం కోటవురట్లలో అధికారులు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి గృహ గణన నిర్వహించినట్లు తహసీల్దార్ తిరుమలరావు, మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ కుమార్ తెలిపారు. గృహ యజమానులను అడిగి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇవాళ శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్లో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం మానవజాతి మనుగడకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలన్నారు.
అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో మదనపల్లిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజల సమస్యలను నేరుగా విని, కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూవివాదాలపై విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
KDP: బి.మఠంలోని ప్రభునగర్ అంగన్వాడీ సెంటర్లో 28 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంగన్వాడీ టీచర్ లత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్థులు, సిబ్బంది అధికారులను కోరుతున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
NTR: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ పార్టీ అని, నాయకులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. గొల్లపూడిలోని అయన కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజలకు పేదరికాన్ని దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపటమే సీఎం చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు.
ATP: మంగళగిరిలోని NTR భవన్లో జరుగుతున్న క్లస్టర్ ఇంఛార్జ్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో కలిసి “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆత్మీయంగా ముచ్చటించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారి అభిప్రాయాలు, క్షేత్రస్థాయి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు.
W.G: భీమవరంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలను పార ద్రోలడానికి పోలీస్ శాఖతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అల్లు శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ నయామ్ అస్మి మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణపై స్వచ్చంద సంస్థల పని తీరు బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ELR: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సిలికాన్ వ్యాలీకి ధీటుగా ‘క్వాంటం వ్యాలీను సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. భీమడోలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్నత విద్య పేదవారికి అందని ద్రాక్షలా ఉందని, కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వివరించారు.
PPM: కురుపాం నియోజకవర్గంలోని పదవీకాలం పూర్తి అయిన సర్పంచులను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలి అన్నారు.