GNTR: పొలిట్ బ్యూరో సభ్యులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో జరుగుతున్న చర్చలను నేడు, రేపు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులను కలిసి మహిళా సాధికారతకు మద్దతుగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చుండూరు, పర్చూరు, చీరాల వన్ టౌన్ స్టేషన్ల పరిధిలో గురువారం సంబంధిత పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాలను వారు జల్లెడ పట్టి, అనుమతి పత్రాలు లేని 90 బైకులు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీన పరుచుకున్నారు.
ASR: మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం అడవి దున్న దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో అతను స్పాట్లోనే మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో, మారేడుమిల్లి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.
KDP: మైదుకూరు సమీపంలోని కృష్ణాపురంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO మల్లేశ్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో జరిగిన అబార్షన్లపై ఆడిట్ నిర్వహించారు. అబార్షన్ల ప్రక్రియలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NLR: నగరంలోని 39వ డివిజన్ మూలపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించి తాగునీటి సరఫరాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఎన్ఎంసీ ఎస్.ఈ రహ్మత్ జాని, ఈఈ రఘురామ్, ఇతర అధికారులతో కలిసి బ్రాహ్మణ వీధి, ఈ.ఎస్.ఆర్.ఎం వాటర్ ట్యాంక్ పరిసరాల్లో కమిషనర్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నీటి సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గురువారం భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ స్లీవా జోజి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజల చేత స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ సౌకర్యాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, సులభంగా, త్వరగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.
GNTR: తెనాలి APSRTC డిపోలో డ్రైవర్లకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన వారికి 8 గంటలకు రూ.1000, 16 గంటలకు రూ.2000 వేతనం అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, అర్హత సర్టిఫికెట్లు తీసుకుని డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలని మేనేజర్ ఏ. రాజశేఖర్ తెలిపారు.
ATP: ఉమెన్స్ కాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించి, ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన ఆర్. వైశాలికి ఎమ్మెల్యే పరిటాల సునీత హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆమె కొనియాడారు. సైప్రస్లో జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వైశాలి, ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు.
VZM: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన జరుగుతున్న PUC సమీక్షా సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాల వివరాలను సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీడీసీఎల్, ఏపీపీఎఫ్సీఎల్ సంస్థల కార్యకలాపాలను పరిశీలించారు.
అన్నమయ్య: మదనపల్లిలో పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొని ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడం జర్నలిస్టుల సంక్షేమానికి నిదర్శనమన్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణుల వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు.
ELR: జంగారెడ్డిగూడెంలో జనసేన సానుభూతిపరుడైన ప్రగడ హర్షిత్ కుమార్కు రెండు కిడ్నీలు ఫెయిల్ అయి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ దారితీసింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.10 లక్షలు అవుతుందని బాధితుల వివరించారు. విషయం తెలుసుకున్న జనసైనికులు విరాళాల ద్వారా రూ. 1,35,000 సేకరించారు. ఈ మొత్తాన్ని సీనియర్ నేత కరటం రాంబాబు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
KRNL: ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తామని మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మంత్రాలయం మండలం చిలకలడోణ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఇవాళ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని డాక్టర్లకు సూచించారు.
W.G: బ్రాహ్మణ చెరువులో ఏఎన్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టి చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్ రుతుకుమారి, టీచర్ విజయమ్మ పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానికులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు.
E.G: గోపాలపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం (BIPC)లో ఎల్.పావని 444/455 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. 2వ సంవత్సరం (MPC)లో కె.రామచరణ్ 829/1000 మార్కులు సాధించాడు. ఈ విద్యా సంవత్సరంలో కళాశాల 83% ఉత్తీర్ణత సాధించింది.
ATP: అనంతపురంలోని TDP కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి నేతృత్వంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని నాగరాజు పిలుపునిచ్చారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం హనుమంతరాయ చౌదరి మృతికి సంతాపం తెలిపారు.