• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘గిరిజన సమస్యలు పరిష్కరించాలి’

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజన హక్కుల రక్షణ కోసం 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.

April 16, 2026 / 04:14 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గరికపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

April 16, 2026 / 04:13 PM IST

‘జన గణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది’

VZM: జనగణన భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని కలెక్టర్ రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం గంట్యాడ ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న జనగణన శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డేటా సేకరణలో ఖచ్చితత్వం అవసరమని ప్రతి ఇంటి సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. అలాగే, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.

April 16, 2026 / 04:11 PM IST

‘నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త కందుకూరి’

E.G: కందుకూరి వీరేశలింగం పంతులు 178వ జయంతి వేడుకల్లో తూ.గో జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ నల్లమిల్లి సుబ్బారావు హాజరయ్యారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నవీన సమాజానికి బాటలు వేసిన సంఘసంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. ఈ వేడుకల్లో కోడూరి శాంతారామ్, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ బూరగడ్డ పాల్గొన్నారు.

April 16, 2026 / 04:10 PM IST

మహిళల భద్రతపై అవగాహన

CTR: చిత్తూరులో మహిళల భద్రత, బాలికల రక్షణే ధ్యేయంగా శక్తి టీం ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ సదస్సులో సోషల్ మీడియా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ ఎలా ప్రాణరక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. మహిళలు తమ రక్షణ కోసం టెక్నాలజీని, పోలీసు వ్యవస్థను ధైర్యంగా వినియోగించుకోవాలన్నారు.

April 16, 2026 / 04:06 PM IST

‘కులగణన సర్వేకు ప్రజలు సహకరించండి’

PLD: క్రోసూరులో కులగణన వలనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలు సక్రమంగా జరుగుతాయని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. సర్వేకి ఇంటింటికి వచ్చే అధికారులకు ప్రజలు సహకరించి వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన అన్నారు. మండల ప్రజలు సహకరించాలని ఎంపీడీవో కోరారు.

April 16, 2026 / 03:54 PM IST

రక్త దానం చేసిన ఉపాధ్యాయులు

W.G: ఆపదలో ఉన్నవారికి మనం ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని ఎంఈవోలు పి. పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం నరసాపురంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు.

April 16, 2026 / 03:42 PM IST

‘గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి’

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

April 16, 2026 / 03:42 PM IST

పాఠశాలలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ

ప్రకాశం: కంభంలోని స్థానిక ఆదిఅంధ్ర ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లర్నింగ్ & స్టడీ మదింపు ప్రక్రియను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మదింపు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 16, 2026 / 03:41 PM IST

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హౌస్ అరెస్ట్

NDL: బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద ఇవాళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్‌బీసీ కాలనీలోని కూలిపోయిన దర్గా వద్దకు వెళ్తుండగా బనగానపల్లె పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

April 16, 2026 / 03:40 PM IST

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లు రికవరీ

VZM: సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాధునిక సాంకేతికతతో రికవరీ చేసిన 10 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్సై గోపాల్ అందజేశారు. గతంలో ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

April 16, 2026 / 03:40 PM IST

దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుంది: కలెక్టర్

సత్యసాయి: దేశాభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జనగణన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీయ గణనను పూర్తి చేశారు. ప్రజలందరూ బాధ్యతగా ఈ ప్రక్రియలో పాల్గొని, ఖచ్చితమైన వివరాలను అందించాలని కలెక్టర్ కోరారు. స్వీయ గణన చేసుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.

April 16, 2026 / 03:40 PM IST

రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే సహాయం

ELR: బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన జరబాల సాయి రామ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.బాధిత కుటుంబ సభ్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుడికి ఉత్తమ వైద్య సేవలు అందేలా రూ 8,65,000 LOC లెటర్‌ను అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని కోరారు.

April 16, 2026 / 03:39 PM IST

కారంపూడిలో ట్యాంక్‌కు శంకుస్థాపన

PLD: కారంపూడి మండల కేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం RWS అధికారులతో సమీక్ష నిర్వహించారు.

April 16, 2026 / 03:37 PM IST

గుంటూరులో సందడి చేసిన బాలయ్య

గుంటూరు నగరంలో ఓ జువెలర్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొనగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

April 16, 2026 / 03:35 PM IST