• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఫ్యూయల్ స్టేషన్‌పై జేసీ తనిఖీ

PLD: నరసరావుపేటలోని కైలాష్ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఇవాళ జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన నిల్వలు, నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఇంధన సరఫరాలో పారదర్శకత, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం అత్యంత ముఖ్యమని జేసీ స్పష్టం చేశారు.

April 28, 2026 / 12:28 PM IST

అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన లారీ

ప్రకాశం: టంగుటూరు మండలం బాబూజీ కాలనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సా నుంచి పాండిచ్చేరికి సిల్వర్ పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

April 28, 2026 / 12:26 PM IST

వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్.ప్రకాష్ జైన్ ఇవాళ వికలాంగుల మధ్యలో తమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుల పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్‌లో సుమారుగా 500 మందికి పైగా పేదలకు అన్నప్రసాదం అందజేశారు. సేవా భావంతో జరిగిన ఈ కార్యక్రమంతో ప్రశంసలు అందుకున్నారు.

April 28, 2026 / 12:23 PM IST

‘ఉపాధి వేతనాలు సమయానికి అందడం లేదు’

KDP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తమకు కూలీలు సమయానికి అందడం లేదని పలువురు శ్రామికులు ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతనాలు మంజూరు చేసింది. డిసెంబర్ 12 నుంచి మార్చి వరకు వేతనాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి త్వరగా వేతనాలు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి శ్రామికులు కోరుతున్నారు.

April 28, 2026 / 12:18 PM IST

‘సృష్టి క్షేత్రం పనులు అడ్డుకోవడం సమంజసం కాదు’

AKP: నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అర్థరాత్రి ఘటనపై జనసేన ఇన్‌ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వీధి రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. సృష్టి క్షేత్రం పనులను అడ్డుకోవడం, లారీని ఆపడం, సిబ్బందిని భయపెట్టడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని పెర్కొన్నారు.

April 28, 2026 / 12:11 PM IST

నగరానికి అంతర్జాతీయ గుర్తింపు: జీత్ అదానీ

VSP: విశాఖలో 1 గిగావాట్ హైపర్స్కల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో భారత్ ఏఐ రంగంలో ముందడుగు వేసిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ మంగళవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిజిటల్ ఇన్ఫ్రా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకు ముంబై, చెన్నైకే పరిమితమైన ఈ సెంటర్లు విశాఖకు విస్తరించడం కీలకమని, దీనివల్ల నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు.

April 28, 2026 / 12:11 PM IST

బంక్‌లో ఇంధనంపై 2 లీటర్ల పరిమితి

PPM: పీలేవిడి గ్రామ సమీపంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్‌ను ఒక్కో వాహనానికి రెండు లీటర్ల పరిమితికి మించి ఇవ్వకూడదని స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జయకుమార్ ఆదేశించారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ యజమానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇంధన కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నియంత్రణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 12:10 PM IST

వేసవి దృష్ట్యా గోశాలలో ప్రత్యేక చర్యలు: ఈవో

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన గోశాలలో ఈవో పెంచల కిశోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గోవులకు సమయానికి మేత, పశుగ్రాసం, తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తాపాన్ని తగ్గించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచుతూ, గోవుల ఆరోగ్యంపై పశువైద్యుడి పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.

April 28, 2026 / 12:07 PM IST

రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మోల్యే నివాళి

KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ అనారోగ్యంతో మృతి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ చంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 28, 2026 / 12:07 PM IST

ధర్మవరంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం పోతుకుంట ఆసుపత్రిలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం కొనసాగుతోంది. సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మొదటి రోజే 102 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 29న మంత్రి స్వయంగా పాల్గొని జైపూర్ ఫుట్ పరికరాలు, ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు.

April 28, 2026 / 12:05 PM IST

ప్రియుడు చేతిలో మహిళ హత్య

ప్రకాశం: బల్లికురవ మండలం రామాంజనేయపురంలో ఓ వివాహిత ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. సంతమాగులూరు ఏల్చూరుకు చెందిన ప్రసన్నకుమార్ ప్రియురాలిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. వారం క్రితం హత్యకు గురైన రజిని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తాజా దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది.

April 28, 2026 / 12:05 PM IST

శిల్పారామంలో హస్తకళలు, ఆర్ట్స్ శిక్షణా శిబిరం

తిరుపతిలోని శిల్పారామంలో మే 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు హస్తకళలు, ఆర్ట్స్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి మూడు కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 కాగా, శిబిర సమయం ఉ. 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయబడుతుంది. వివరాలకు 88866520‌44 నంబర్ ను సంప్రదించాలన్నారు.

April 28, 2026 / 12:03 PM IST

UPDATE: రోడ్డు ప్రమాదం.. పూర్తి వివరాలు

VZM: పూసపాటిరేగ మండలం పేరాపురం హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిని విశాఖకు చెందిన ఇరిగేషన్‌ కాంట్రాక్టర్‌ శీనివాసరావు, కె.సింహాచలం, సామంతుల రమేశ్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

April 28, 2026 / 11:58 AM IST

పబ్లిక్ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలి: కమిషనర్

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మంగళవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించి, వాటిని శుభ్రంగా ఉంచాలని, మరమ్మతులుంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతలో కడప ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని, పారిశుద్ధ్య పనుల్లో లోపాలు లేకుండా పర్యవేక్షించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.

April 28, 2026 / 11:53 AM IST

పెట్రోల్ బంకుల తనిఖీ చేసిన కలెక్టర్

PLD: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఉన్న HP, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో మాట్లాడిన ఆమె, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

April 28, 2026 / 11:52 AM IST