KDP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తమకు కూలీలు సమయానికి అందడం లేదని పలువురు శ్రామికులు ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతనాలు మంజూరు చేసింది. డిసెంబర్ 12 నుంచి మార్చి వరకు వేతనాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి త్వరగా వేతనాలు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి శ్రామికులు కోరుతున్నారు.