సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం పోతుకుంట ఆసుపత్రిలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం కొనసాగుతోంది. సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మొదటి రోజే 102 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 29న మంత్రి స్వయంగా పాల్గొని జైపూర్ ఫుట్ పరికరాలు, ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు.