• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సాంకేతికతతో నేరాలకు చెక్: ఎస్పీ

ELR: నేర నియంత్రణలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, గుర్తుతెలియని మృతదేహాల ఆచూకీ కోసం ఆధునిక సాఫ్ట్‌వేర్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

April 16, 2026 / 06:53 AM IST

రౌడీషీటర్ అరెస్ట్:. ఏడు రోజుల రిమాండ్

ATP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ షేక్ షమీర్‌ను అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఇతను తిరిగి దాడులకు తెగబడటంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిబంధనలు మీరినందుకు జడ్జి ఏడు రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

April 16, 2026 / 06:51 AM IST

మీ ఊరి లైబ్రరీ సెస్ ఎంతో తెలుసా?

NLR: జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్ బకాయిలపై బుధవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఛైర్ పర్సన్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ రూ.10 కోట్లు, కావలి 50 లక్షలు, గూడూరు, నాయుడుపేట చెరో 40 లక్షలు, ఆత్మకూరు 30 లక్షలు, వెంకటగిరి 35 లక్షలు, బుచ్చి 20 లక్షలు, అల్లూరు 7 లక్షల చొప్పున బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఆదేశించారు.

April 16, 2026 / 06:50 AM IST

జిల్లాలో 10.26 లక్షల ఓట్లు

CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.

April 16, 2026 / 06:40 AM IST

వాహనాల తనిఖీలు.. 226 కేసులు నమోదు

కడప జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని SP నచికేత్ హెచ్చరించారు. బైకర్లు హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలన్నారు. బుధవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ.59,325ల జరిమానా విధించినట్లు వెల్లడించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.

April 16, 2026 / 06:39 AM IST

కర్నూలులో అండర్-16 బాలుర క్రికెట్ ఎంపికలు

KRNL: ఈనెల 19వ తేదీన కర్నూలు స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో అండర్-16 బాలుర విభాగంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన వెల్లడించారు.

April 16, 2026 / 06:32 AM IST

పర్వతారోహకుడిని సన్మానించిన కలెక్టర్

W.G: అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అన్మిష్ వర్మ భూపతిరాజును కలెక్టర్ నాగరాణి బుధవారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన ఏడు శిఖరాలు, ఏడు అగ్నిపర్వతాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా అన్మిష్ రికార్డు సృష్టించడం గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.

April 16, 2026 / 06:25 AM IST

రాయచోటిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ఇవాళ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశం పట్టణంలో జరుగుతున్న అసాంఘిక, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమని సీఐ వెంకట చలపతి తెలిపారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా, మట్కా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 16, 2026 / 06:24 AM IST

టోల్ ఎగవేత.. మూడు టిప్పర్లకు జరిమానా

అనకాపల్లి: రహదారి నిబంధనలు అతిక్రమించడంతో పాటు టోల్ ఫీజును ఎగ్గొట్టేందుకు అడ్డదారిన వెళుతున్న మూడు టిప్పర్ లారీలను పోలీసులు పట్టుకున్నారు. నక్కపల్లి మండలం ఉపమాక మీదుగా వెళుతున్న మూడు లారీలను ఎస్సై సన్నిబాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని ఆర్టీఓకు అప్పగించారు. ఒక లారీకి రూ.56,000, మరో లారీకి రూ.66,000, మూడవ లారీకి 74,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

April 16, 2026 / 06:18 AM IST

చేవూరిలో అవినీతి ఆరోపణలపై విచారణ

NLR: గుడ్లూరు చేవూరులో మామిడి తోటల భూసేకరణ పరిహారంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉద్యానశాఖ బుధవారం సాయంత్రం దర్యాప్తు ప్రారంభించింది. శాఖ ID మునిరెడ్డి, అధికారులు చేవూరులో విచారణ చేపట్టారు. 53 మంది రైతులకు చెందిన 130 ఎకరాల్లోని మామిడి చెట్లకు పరిహారం చెల్లింపులో అక్రమాలు ఏ మేరకు జరిగాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు

April 16, 2026 / 06:17 AM IST

లారీని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి

ప్రకాశం: త్రిపురాంతకం (M) రాజుపాలెం BTC కాలనీ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెంకు చెందిన శివన్నారాయణ బైక్‌పై మార్కాపురం నుంచి రాజుపాలెం వస్తుండగా.. రోడ్డుపై మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉన్న లారీని వెనుక భాగాన ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 16, 2026 / 06:15 AM IST

ఢిల్లీకి వెళ్లిన మంత్రి సవిత

సత్యసాయి: మహిళా బిల్లుకు మద్దతు తెలిపేందుకు మంత్రి సవిత ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్‌లో ఈ కీలక బిల్లుపై నేడు జరిగే చర్చను ఆమె ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మహిళా సాధికారతకు ఈ చట్టం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా పెద్దపీట వేసినట్లవుతుందని వెల్లడించారు.

April 16, 2026 / 06:11 AM IST

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడిగింపు

KKD: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం హెల్త్ స్కీమ్‌ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో జారీ చేసిందని కాకినాడ సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప తెలిపారు. కాకినాడ జిల్లాలో అక్రిడిటేషన్ https://www.cfms.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా రూ.1,250 చెల్లించి, ఆ వివరాలను స్థానిక కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

April 16, 2026 / 06:11 AM IST

కేజీబీవీలో ఉత్తమ ఫలితాలు

CTR: ఇంటర్ ఫలితాలలో కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటినట్టు సమగ్ర శిక్ష ఏపిసీ వెంకటరమణ తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 97%, సెకండ్ ఇయర్‌లో 96% మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రొంపిచర్ల, కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, పుంగనూరు కేజీబీవీలో 100% ఫలితాలు నమోదు అయ్యాయి అన్నారు. ఫస్ట్ ఇయర్‌లో 302 మందికి 292 మంది, సెకండ్ ఇయర్‌లో 273 మందికి 262 మంది పాసయ్యారు.

April 16, 2026 / 06:05 AM IST

లోకేష్‌కి కీలక పదవి రావడంపై సంబరాలు

ATP: మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు అనంతపురం నేతలు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

April 16, 2026 / 06:04 AM IST