• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రాష్ట్రస్థాయి శాప్ చెస్ లీగ్ ప్రారంభం’

TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:43 PM IST

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి: ఎమ్మెల్యే

SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : హౌసింగ్ పీడీ

TPT: తిరుపతి హౌసింగ్ కార్యాలయంలో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పనులను వేగవంతం చేసి, నాణ్యత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. సమావేశంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 08:39 PM IST

మహావీర్ సర్కిల్ వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి

కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద శనివారం లారీ ఢీకొని కేసర్ల హేమసుందర్ (56) మృతి చెందారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు కేసర్ల పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

February 21, 2026 / 08:32 PM IST

సజ్జాపురంలో అగ్నిప్రమాదం

W.G: తణుకు సజ్జాపురం మహాలక్ష్మి నగర్ లోని ఖాళీ స్థలాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ స్థలంలోని పిచ్చిమొక్కలకు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

February 21, 2026 / 08:32 PM IST

గురుకుల పాఠశాలలో సంక్షేమ శాఖ అధికారులు తనిఖీ

KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ నాగముని, పూర్ణచంద్రరావు శనివారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని శిథిలావస్థమైన తరగతి గదులను సందర్శించి, పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులను ఆరా తీశారు.

February 21, 2026 / 08:30 PM IST

రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.

February 21, 2026 / 08:23 PM IST

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.

February 21, 2026 / 08:23 PM IST

తిరుపతిలో స్వర్ణోత్సవ వేడుకలు

CTR: కరకంబాడి లోని Amara Raja Group ఆడిటోరియంలో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:21 PM IST

‘మధుడిలో ఆధార్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి’

సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్‌ సంబంధించిన బయోమెట్రిక్‌ అప్టేట్‌, ఐరిస్‌ స్కాన్‌, పేరు మార్పులు, ఫొటో అప్డేట్‌, పుట్టిన తేదీ మార్పు, సెల్‌ నంబరు లింక్‌, కొత్తగా ఆధార్‌ కార్డులు ప్రింట్‌ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...

February 21, 2026 / 08:20 PM IST

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

SKLM: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ నేతృత్వంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్‌లో ఇందిరా భవన్ వద్ద బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

February 21, 2026 / 08:19 PM IST

చిత్తూరు ఎమ్మెల్యే రేపు పర్యటన షెడ్యూల్

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పుత్తూరు రోడ్డులో మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం, పీవీపీఎన్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఆఫీస్ బస్టాండ్ వద్ద పార్టీ భవన భూమిపూజ, రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

February 21, 2026 / 08:17 PM IST

భాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

VZM: గంట్లాం గ్రామంలో నివాసం ఉంటున్న చిట్టిబాబు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో కుటుంబానికి ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయంగా రూ.15,000 నగదు, సరుకులు ఇచ్చారు.

February 21, 2026 / 08:16 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన మంత్రి

ASR: కోటవురట్ల మండలానికి చెందిన స్వచ్ఛ రథాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతకు స్వచ్ఛ రథాలు దోహదపడతాయన్నారు. పొడి చెత్తను తీసుకుని అవసరమైన నిత్యవసరం వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:13 PM IST