• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘దేశ ప్రతిష్టపై దాడులను సహించం’

KRNL: పత్తికొండలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఎక్స్‌పో సందర్భంగా భారతమండపంపై దాడిని ఇవాళ మండల అధ్యక్షుడు కరణం నరేష్ తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 02:13 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించాలి: PDSU

సత్యసాయి: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. కనేకల్ అంబేద్కర్ పాఠశాల వద్ద ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బస్సులు నడపాలని, వాహనదారులు విద్యార్థులకు లిఫ్ట్ ఇచ్చి పరీక్షా కేంద్రాలకు చేర్చి సహకరించాలని కోరారు.

February 22, 2026 / 02:13 PM IST

ఉయ్యాలవాడకు మార్టేరులో ఘన నివాళి

W.G: బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉమ్మడి గోదావరి జిల్లాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి కృష్ణారెడ్డి కొనియాడారు. ఆదివారం మార్టేరులో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన ధీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 02:05 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కడప పోలీసుల నివాళి

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.

February 22, 2026 / 02:05 PM IST

మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని దానవాయిపేట మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

February 22, 2026 / 02:00 PM IST

బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన డీడీ

NLR: బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని డీడీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని స్వయంగా రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 02:00 PM IST

SFI ఆధ్వర్యంలో ‘ఆల్ ది బెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ

KKD: పిఠాపురంలో SFI ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆల్ ది బెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోస్టర్‌ను పిఠాపురం CI శ్రీనివాస్, SFI లోవరాజు, సిద్దు చేతుల మీదుగా ఆవిష్కరించారు. రేపు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ‘ALL The Best’ చెప్తూ ధైర్యంగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

February 22, 2026 / 02:00 PM IST

రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం

AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన నేషనల్ పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నెం గణేష్‌కు జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈనెల 25 నుంచి 28 వరకు మీరట్‌లో జరిగే టోర్నమెంట్‌కు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గణేష్ ఆదివారం తెలిపారు. టోర్నమెంట్లో సత్తా చాటి ఏపీకి మంచి పేరు తీసుకువస్తానన్నారు.

February 22, 2026 / 01:58 PM IST

‘నిందితులను అరెస్ట్ చేయాలి’

సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు నిందితులతో కుమ్మక్కైన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని విదసం రాష్ట్ర కన్వీనర్ డా. బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 01:55 PM IST

వేదనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు, స్థానిక సంఘాల వారు భక్తుల కోసం అన్ని సౌకర్యాలను అందించారు. కుంభాభిషేకం ద్వారా ఆలయంలో పవిత్రత, ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగినట్లు భక్తులు తెలిపారు.

February 22, 2026 / 01:40 PM IST

మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు మొదలు

KDP: నర్సాపురంలోని ఏపీ మోడల్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య పేర్కొ న్నారు. ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని దరఖాస్తుచేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:40 PM IST

రేపు ఎర్రం నాయుడు జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

SKLM: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 69 వ జయంతి వేడుకలు నిమ్మాడలో సోమవారం నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉ. 10కు నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని నివాళులర్పిస్తారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 01:30 PM IST

ప్రజలందరికీ జగన్ క్షమాపణ చెప్పాలి: సుంకర

KKD: దేశ ప్రజలందరికీ జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాకినాడకు చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె కాకినాడలో మాట్లాడుతూ.. శాసనమండలి సభలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానపరుస్తూ స్వామివారి చిత్రపటాలను వైసీపీ సభ్యులు విసిరి వేయడాన్ని నిరసిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 01:30 PM IST

జాబ్ మేళా పోస్టర్లు ఆవిష్కరించిన స్పీకర్

AKP: నర్సీపట్నంలోని రిషి డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉపాధి మేళాలో సుమారు 17 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, వీటి ద్వారా 1855 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.

February 22, 2026 / 01:28 PM IST

అభివృద్ధి పథంలో రాప్తాడు నియోజకవర్గం

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆరు మండలాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతుండగా, జెస్సిపల్లి నుంచి పేరూరు వరకు 54 కిలోమీటర్ల మేర సాగుతున్న పరిటాల రవీంద్ర కాలువ పనులు రైతుల కలలను సాకారం చేస్తున్నాయి. కాలువల ద్వారా చెరువులకు నీరు నింపుతుండటంతో వ్యవసాయ రంగం కళకళలాడుతోంది.

February 22, 2026 / 01:25 PM IST