GNTR: MEF జాతీయ సమావేశానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు MEF జాతీయ అధ్యక్షుడు ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం గుంటూరులోని మౌర్య ఫంక్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మాదిగ ప్రముఖులు, యువకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో MEF, రాష్ట్ర అధ్యక్షులు,ఉన్నారు.
SKLM: జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం యూటీఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిద్దామన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిద్దామని తెలిపారు. మూఢ విశ్వాసాల నిరోధక చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు.
NTR: విజయవాడ నగర ప్రజలకు, పోలీస్ సిబ్బంది, అధికారులు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిచుకొనే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు తప్పని సరి చేయటమైనదని స్పష్టం చేశారు.
NTR: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తుంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.
CTR: పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లికి చెందిన రైతు కందిరీగల శంకర్(60) ఊరికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పాడి ఆవులను మేతకు తోలుకొని వెళ్ళాడు. అక్కడ చెట్ల పొదల్లో ఉన్న విష సర్పం కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పాము కరిచిందని ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పడంతో వారు వచ్చి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె, గుంతకల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నైరుతి రెడ్డి హాజరయ్యారు. రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ELR: దేశ సమైక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని సీపీఎం జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఆదివారం ఏలూరులో నాయకులు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామరస్యం, సమానత్వం ప్రజల నడుమ నెలకొన్నప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు.
BPT: పిట్టలవానిపాలెం గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాసరావు భారత్ సేవా సింహం నేషనల్ అవార్డు, జోహార్ లాల్ నెహ్రూ జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి భవన్లో ఆదివారం ఈ అవార్డును ప్రముఖ న్యూరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, సినీ నిర్మాత మూస అలీ ఖాన్ పలువురు ప్రముఖులు శ్రీనివాసరావుకు అందజేసి గజమాలతో సత్కరించారు.
KDP: రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ మైదుకూరు పట్టణంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామానికి చెందిన యువ రైతు నాగేంద్ర కుటుంబ సమేతంగా పొలం దగ్గర ఉరివేసుకుని చనిపోవడం దురదృష్టకరమని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సహాయం చేస్తామని హామీలు ఇచ్చిన ఏమి ప్రయోజనం ఉందన్నారు.
కడప: పులివెందుల పట్టణంలోని నడిరోడ్డుపై ఆదివారం ఓ మహిళ తనకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను అన్నదమ్ములు, అధికారులు, బ్యాంకు ఉద్యోగులు మోసం చేశారని ‘సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లమ్స్’ అనే ప్లకార్డు చేతి పట్టుకుని నిరసన తెలిపింది.
SKLM: ఎచ్చెర్ల మండలం రామ్ నగర్ వీధిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మి, టీడీపీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మెండ రాజారావు, భాస్కరరావు, మల్లేశ్వరరావు, రమణ ఉన్నారు.
NLR: దుత్తలూరు మండల కేంద్రంలో పలు మండలాలకు చెందిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనల్లో డ్రైవింగ్ సమయంలో కునుకు తీస్తే అలెర్ట్ సైరన్ మోగడం, నీడను బట్టి సమయాన్ని తెలపడం, స్పీడ్ బ్రేకర్స్ వద్ద డేంజర్ లైట్ వెలగడం, గణిత ఫార్ములాలు, భూకంప సూచనలు తెలిపే విధానం తదితర ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఆదివారం తూర్పు కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. తూర్పు కాపు సామాజిక వర్గం సంక్షేమానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లేబర్ కాలనీలో ఎల్.రవణ ఆధ్యక్షతన ఆదివారం క్యాష్యూ లేబర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఈ మేరకు గౌరవ అధ్యక్షులు ఎన్.గణపతి, అధ్యక్షులు శిస్టు.గోపి, ఉపాధ్యక్షులు ఎల్.రవణ ప్రధాన కార్యదర్శి ఏ.ఆనందరావు ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు ఎన్.గణపతి మాట్లాడుతూ.. జీడి కార్మికులకు సమస్యలు పై పోరాడుతామన్నారు.
AKP: గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామంలో ఆదివారం రెల్లి గర్జన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సామాజిక రెల్లి ఉప కులాల జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి అప్పనబాబు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రెల్లిలు ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. తక్షణమే రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.