సత్యసాయి: పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పెనుకొండ డీఎస్పీ, సీఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
KDP: VN పల్లె (M) తలపనూరులోని గంగమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయము అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం అమ్మవారికి గ్రామ మహిళలచే బోనాల సమర్పణ ఉంటుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
CTR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం హిందూ సంఘాలవారు పుంగనూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అన్న క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి, ఇందిరా సర్కిల్, MBTరోడ్డు గుండా పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్కు జై అంటూ చేపట్టిన నినాదాలు పట్టణంలో మారుమోగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
SKLM: నరసన్నపేట మండలం గోపాలపెంట గ్రామానికి చెందిన బబ్బోది పెంటమ్మ, బుడుమూరు అమ్మడమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం వారిరువురిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఎంపీటీసీ మల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో బైక్ ప్రమాదానికి గురైన వైసీపీ నాయకుడు ఈరప్పను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్సల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: ఆత్మకూరు మండల ప్రభుత్వ వైద్యశాలలో ఓ మహిళ ఇద్దరు కవల పిల్లలను జన్మనిచ్చారు. మర్రిపాడు మండలం చిన్నమాచనూరు గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తొలి కాన్పులో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవం కావడంతో ఆమెకు ఈ విషయం తెలుపగా.. ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం లక్ష్మీదేవి పుట్టినట్టుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
NDL: పగిడ్యాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్ర సిబ్బంది హాజరు పట్టి రిజిస్టర్ పరిశీలించారు. మహిళల ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బంది ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. బాలిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 35 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు. శనివారం బంధువుల కార్యక్రమానికి కుటుంబంతో కలిసి పెనికలపాడు గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పక్కింటి వారు వాకిలి తెరిచి ఉందని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులో వచ్చింది.
AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చోడిపిల్లి బంగారి రూ.1,11,101 విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళాన్ని నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ నిర్వాహకులకు అందజేశారు. విరాళం అందజేసిన మాజీ సర్పంచ్ను మంత్రి అభినందించారు.
విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) శ్రీ కె. రామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బెడ్ షీట్లు, శుభ్రతను పరిశీలించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన కౌన్సెలింగ్లో సేవా ప్రమాణాలు పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటి పోలీస్ కార్యాలయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం ఘన నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి యోధుల్లో ఒకరైన ఆయన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ప్రకాశం: పొన్నలూరులో ఆదివారం పొగాకు బ్యారన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పొగాకు బ్యారన్ మొద్దుగొట్టంపై కర్ర జారి పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికి పూర్తిగా దగ్ధమైంది. బ్యారన్ యజమానులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.