• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లిఫ్టింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

VZM: విజయనగరంలో పలు చోట్ల చలిలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఆదివారం వేకువజామున లిఫ్టింగ్ హాండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కంది గౌరీ శంకర్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

December 29, 2024 / 03:00 PM IST

శ్రీశైలంలో 0.338 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

KRNL: శ్రీశైల జలాశయం పరిధిలోని తెలంగాణ ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 0.338 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 715 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. అలాగే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 1500 క్యూసెక్కులు,హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1631 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

December 29, 2024 / 02:56 PM IST

మదనపల్లెలో హైందవ శంఖారావంపై భారీ రాలీ

CTR: హైందవ శంఖారావంకు మద్దతుగా మదనపల్లెలో హిందువులు ఆదివారం భారీ రాలీ నిర్వహించారు. విజయవాడలో జనవరి 5న దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖరావం మహాసభకు సంఘీభావంగా మదనపల్లె నుంచి హిందువులు ఈ రాలీ నిర్వహించి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

December 29, 2024 / 02:56 PM IST

అధికారులపై టీడీపీ నాయకుడి ఆవేదన

CTR: పుంగనూరులో జరిగే అధికారిక కార్యక్రమాలు టీడీపీ నాయకులకు అధికారులు చెప్పడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సయ్యద్ సుహేల్ బాష వాపోయారు. పుంగనూరు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దయచేసి అధికారులు అధికారిక కార్యక్రమాలను తమకు తెలియజేయాలని, తద్వారా ప్రజలకు అభివృద్ధి గురించి తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.

December 29, 2024 / 02:54 PM IST

అడ్డతీగలలో రూ.10కే బిర్యానీ.. ఎగబడిన ప్రజలు

E.G: అడ్డతీగలలో ఆదివారం నూతనంగా ప్రారంభమైన ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ రూ. 10కే బిర్యానీ ప్యాకెట్ ఇస్తుండడంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇంకా ప్రారంభం కాకముందు నుంచి జనం గుమిగూడి క్యూ కట్టారు. ఇతర మండలాల నుంచి బిర్యానీ ప్యాకెట్ కోసం ఎగ. దీంతో అడ్డతీగల వై.రామవరం రూట్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

December 29, 2024 / 02:53 PM IST

ప్రభుత్వం వెంటనే 30% మద్యంతర భృతిని చెల్లించాలి

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో జోనల్ సమావేశం జరగగా జిల్లా అధ్యక్షులు వాక జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం వెంటనే పిఆర్‌సి కమిషన్‌ను నియమించి 30% మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ విశేష కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ పి.రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్ పాల్గొన్నారు.

December 29, 2024 / 02:52 PM IST

నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వంలో కురుబ కల్యాణ మంటపం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అది వైసీపీ ప్రభుత్వం హయాంలో మరుగున పడిపోయింది. తిరిగి ఇప్పడు నిధులు కేటాయించి కల్యాణమంటపం పూర్తికి చర్యలు తీసుకోవాలని కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలాస్వామీ, కురుబ సంఘం నాయకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని కలసి వినతిపత్రం అందజేశారు.

December 29, 2024 / 02:46 PM IST

కనకదాసు విగ్రహాన్నీ ఆవిష్కరించిన మంత్రి సవిత

ATP: పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో మంత్రి సవిత ఆదివారం కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని కురుబ కులస్తులు కోరిక మేరకు మంత్రి సవిత తన తండ్రి రామచంద్రరెడ్డి జ్ఞాపకార్థం విగ్రహాన్ని విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, కురుబ కులస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

December 29, 2024 / 02:45 PM IST

రేపు తిరుపతిలో గ్రీవెన్స్

TPT: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగర వాసుల వద్ద నుంచి వినతలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

December 29, 2024 / 02:41 PM IST

రూ.5 లక్షల భీమా చెక్కు అందజేత

E.G: కపీలేశ్వరపురం మండలం,కేదార్లంకలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు యర్రంశెట్టి కృష్ణ కుటుంబానికి రూ.5లక్షల భీమా చెక్కు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం అందజేశారు. సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్ యర్రంశెట్టి వీరబాబుకు ఆయన అభినందనలు తెలిపారు.

December 29, 2024 / 02:40 PM IST

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి యోగ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. డిప్లొమా ఇన్ యోగ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ యోగ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

December 29, 2024 / 02:39 PM IST

గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ

గుంటూరు: పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16శాతం క్రైమ్ రేటు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామని అన్నారు. రోడ్డు యాక్సిడెంట్స్ 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 224మందిని గంజాయి కేసుల్లో పట్టుకున్నామన్నారు.

December 29, 2024 / 02:38 PM IST

గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

NLR: సంగం మండల కేంద్రంలోని పెన్నా నది సమీపంలో ఉన్న గిరిజనులకు ఆదివారం పట్టణానికి చెందిన విద్యార్థులు దుప్పట్లను పంపిణీ చేశారు. దాదాపుగా 50 మందికి దుప్పట్లను అందజేయడం జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని ఆ నగదుతో గిరిజనులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

December 29, 2024 / 02:34 PM IST

రక్త దానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే

CTR: జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాష వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదానం చేసిన వారితో సమానమని పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

December 29, 2024 / 02:31 PM IST

‘రేపు గండాలయ్య స్వామి ఆలయానికి రావద్దు’

GNTR: మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎగువ భాగంలో ఉన్న గండాలయ్య స్వామి ఆలయ దారులన్నీ మూసివేసినట్లు గండాలయ జ్వాల నరసింహ స్వామి వారి భక్త బృందం సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా గండ దీపం నిర్మాణ పనులు జరుగుతున్నాయని కావున ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాలనుంచి ఆలయానికి వచ్చే భక్తులు గమనించాలన్నారు.

December 29, 2024 / 02:30 PM IST