SKLM: టెక్కలి మండలం, అక్కవరం గ్రామంలో సోమవారం తహసీల్దార్ సాధు దిలీప్ చక్రవర్తి అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ పరిధిలో ఏమైనా సమస్యలు వుంటే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సదస్సులో మాజీ ఎంపీటీసీ ఆవల శ్రీరాములు సమక్షంలో గ్రామ ప్రజలు వినతులు తహసీల్దార్కి వినతులు అందజేశారు.
VSP: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ చేశారు. సోమవారం అచ్యుతాపురంలో హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలను దేశ ప్రజలు అందరూ ఖండించాలన్నారు.
పల్నాడు: నరసరావుపేటలో జాతీయస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు నిర్వహణ సంతోషమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. సోమవారం ఫ్లోర్ బాల్ పోటీలు నిర్వహిస్తున్న కే.రిడ్జ్ పాఠశాలను సందర్శించారు. క్రీడాకారులతో కలిసి ఫ్లోర్ బాల్ ఆడారు. నరసరావుపేట జాతీయ క్రీడా పోటీలకు వేదికగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశ ప్రతిష్ఠతను పెంచాలని క్రీడాకారులకు సూచించారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు అమావాస్య ప్రత్యేక పూజలు అందుకుని విశేషాలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి పంచామృత కుంకుమార్చనలో చేపట్టి స్వామి మూల విరాట్పై పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారి విశేష అలంకరణను భక్తుల దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
W.G: తణుకు మున్సిపల్ పాఠశాల నుంచి స్కేటింగ్ రింక్లో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు సోమవారం తణుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలని కోరుతూ క్రీడాకారులను, కోచ్ లావణ్య, చందులను అభినందించారు.
ప్రకాశం: జిల్లాలో 2,85,438 మంది వివిధ రకాల పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.122.79 కోట్లను విడుదల చేసిందని కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఈ నిధులు సోమవారమే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయనున్నారు. 31వ తేదీ ఉదయం 6 గంటలకు ముందే లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించనున్నారు.
ELR: అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమిత్ షా బొమ్మలను దహనం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
W.G: దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల పరిష్కరించుకోవాలని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో గ్రివేన్స్ డే నిర్వహించారు. ఈ మేరకు వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. మీ కోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం: మార్కాపురం మండలం నికరంపల్లిలో సోమవారం ఉదయం ఎమ్మార్వో చిరంజీవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సును ప్రజలంతా వినియోగించుకోవాలని, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
కడప: న్యూ ఇయర్ వేడుకలను కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కడప వన్ టౌన్ సీఐ రామకృష్ణ ప్రజలకు సూచించారు. రేపు రాత్రి 9గంటల నుంచి కడప నగరంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంక్షలను కఠినతరం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. బహిరంగంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కృష్ణా: కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గుడివాడ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నెహ్రూ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కడప: బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పట్టణంలో వరుసగా బైక్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
కోనసీమ: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే భర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ప్రజలకు అమిత్ షా సమాధానం చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
NDL: రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం నాడు ధర్నా చేపట్టారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా చేస్తుండడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ ప్రతినిధులు రైతులతో చర్చిస్తున్నారు.
కృష్ణా: గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో జరుగుతున్న 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యక్రమంలో స్వయంగా డప్పు కొట్టి పలువురిని అలరించారు. ఈ కార్యక్రమంలో కొలికపూడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలు సందర్భంగా కొలికపూడి కొద్దిసేపు మాట్లాడారు.