PPM: జిల్లాలో చేపట్టిన డోలి రహిత రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులను పూర్తిచేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీర్ అధికారులను ఆదేశించారు. మొత్తం మంజూరు చేసిన 81 డోలి రోడ్ల పనులు కూడా జరగాలని, ప్రారంభం కాని రోడ్లు ఉంటే వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటివరకు 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.
BPT: వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన పాడి పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం అసెంబ్లీలో విమర్శించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన వెటర్నరీ ఆసుపత్రులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు, అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
NTR: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా సైకిల్ యాత్రలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని సూచించారు.డ్రగ్స్ నిర్మూలన కోసం సమాజం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: జిల్లా జలధార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో జిల్లా జలధార, కలెక్టర్ నిశాంత్ కుమార్ ఫొటోను షేర్ చేసిన సీఎం, ఏడాది కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. 25వ స్థానంలో ఉన్న జిల్లాను రెండో స్థానానికి తీసుకురావడంలో కలెక్టర్ కృషి కీలకమని కొనియాడారు.
KDP: వల్లూరు మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వతరగతి ప్రవేశానికి దరఖాస్తులను నేటి నుంచి మార్చి 31 వరకు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేశ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12న ఉదయం 10 గంటలకు ఆదర్శపాఠశాలలో పరీక్ష జరుగుతుందన్నారు. ఓసీ, బీసీలు రూ.200, ఎస్సీలు రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
W.G: భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.
అనకాపల్లి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటలు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు స్పీకర్ల అయ్యన్నపాత్రుడు శాసనసభలో తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 3 రోజులు పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బహుమతి ప్రధానోత్సవానికి కుటుంబ సభ్యులతో హాజరు కావాలన్నారు.
KRNL: కౌతాళంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఇవాళ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పట్టాభిలు టీడీపీ, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 44 ఏళ్లుగా తమ కుటుంబం పార్టీకి సేవలు అందించినప్పటికీ, ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఎంపిక విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.
ATP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ పోస్టర్లను విడుదల చేశారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశం కోరే విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
E.G: దేవరపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాలు ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారాయని వాపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి. హరికృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.
BPT: బాపట్ల మండలం అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో గత సోమవారం గల్లంతైన ఇద్దరు యువకులలో చందు అనే యువకుడి మృతదేహం మంగళవారం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే, మరో యువకుడు పీటా వంశీ లభ్యం,ఇప్పటికే లభ్యంమైనట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
SKLM: ఉండవల్లిలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి హాజరయ్యారు. ఈ మేరకు మంత్రి ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు రవికుమార్, శిరీష, రమణ మూర్తి పాల్గొన్నారు.
SS: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 1న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.
చిత్తూరు: కార్వేటినగరం మండలంలో మందుబాబుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాలను పోలీసులు రూపు మార్చుతున్నారు. ఎస్పీ తుషార్ డూడీ ధైర్య స్పర్శ అనే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ తేజస్విని సిబ్బందితో కలిసి మందుబాబులకు అడ్డాగా ఉన్న అమ్మపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడి చెత్త తొలగించారు. మందుబాబులు కూర్చోకుండా ప్రదేశాలను నీటిగా రెడీ చేస్తున్నారు.