• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జనన మరణాల నమోదుపై కొత్త నిబంధనలు’

AKP: జనన మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిందని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్‌ను 21 రోజుల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చునని సూచించారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25, 30 నుంచి ఏడాదిలోపు రూ.250 అపరాధ రుసుం చెల్లించాలన్నారు.

February 20, 2026 / 08:28 AM IST

పిడుగురాళ్లలో కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

PLD: పిడుగురాళ్లలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. నిందితుడిని పోలీసులు సివిల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పట్టణంలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వాహనదారులను గురువారం రాత్రి హెచ్చరించారు.

February 20, 2026 / 08:28 AM IST

రాజమండ్రిలో నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు

E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘యువతలో ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపణ్యం తెలిపారు. ఈ సదస్సులో అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు పాల్గొని అవసరమైన మెలకువలు నేర్చుకోవచ్చన్నారు.

February 20, 2026 / 08:27 AM IST

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే భేటీ

SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, బోధి బట్టి డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. వంశధార కాలువలు, డ్రైనేజీ పనుల కోసం రూ. 31.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

February 20, 2026 / 08:27 AM IST

ఆరోగ్య సర్వే లక్ష్యాలను చేరుకోవాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్

PPM: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఆరోగ్య సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. అడ్డాపుశీల లో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత ఎన్.సి.డి, ఆర్.బి.ఎస్.కె సర్వే, స్క్రీనింగ్‌లపై వైద్య సిబ్బందిని ఆరా తీసి ఆన్లైన్ నమోదు నివేదికలు పరిశీలించారు.

February 20, 2026 / 08:25 AM IST

ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి .. మృతి

ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు చెందిన సతీశ్ (25) గురువారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాళ్లలో చెరువు పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

February 20, 2026 / 08:24 AM IST

నేటి నుంచి మూడు రోజులు పవర్ కట్

E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎస్ఈ నటరాజన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతానగరం, సింగవరం పంచాయతీలోని నాగరత్నం కాలనీ, రఘుదేవ పురాల్లో గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగగదారులకు విద్యుత్‌ను నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.

February 20, 2026 / 08:22 AM IST

టిప్పర్ ఢీకొని విరుపాక్షికి గాయాలు

KRNL: ఆదోని శివారు సిరుగుప్ప సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన విరుపాక్షి గాయపడ్డారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ తెలిపారు.

February 20, 2026 / 08:22 AM IST

గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి: జేసీ

CTR: గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి అని జేసీ రాజేంద్రన్ హెచ్చరించారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌‌లో గ్యాస్ సిలిండర్ల సరఫరా డీలర్లు, నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జేసీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీబీఆర్ఎస్ సర్వేలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రజల సంతృప్తి శాతంలో జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు.

February 20, 2026 / 08:21 AM IST

హెల్మెట్‌ లేకుంటే కఠిన చర్యలు: రావులపాలెం సీఐ

కోనసీమ: రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని రావులపాలెం సీఐ సిహెచ్. విద్యాసాగర్‌ హెచ్చరించారు. గురువారం రాత్రి ఆలమూరు సెంటర్‌లో ఎస్సై జి. నరేష్‌తో కలిసి హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేని ప్రయాణం మృత్యుపాశమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 20, 2026 / 08:21 AM IST

విషాదం.. ఆటో ఢీకొని చిన్నారి మృతి

BPT: చీరాల మండలంలోని కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళితనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి సాయి దుర్గపై ప్రమాదవశాత్తు ఆటో వెళ్లినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

February 20, 2026 / 08:20 AM IST

బాలికపై అత్యాచారం..A2 కోసం కీలక నిర్ణయం

అన్నమయ్య: మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో A2 ఎందుకురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో,కేసులోని కీలక ఆధారాలు చెరిగిపోకుండా SP ధీరజ్ DSP మహేంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ఇంటిని తమ ఆధీనంలో ఉంచారు.

February 20, 2026 / 08:19 AM IST

నేడు ఆలూరులో మెగా జాబ్ మేళా

KRNL: ఆలూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. SSC నుంచి PG వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల యువత పాల్గొనవచ్చుని ఇన్ ఛార్జ్ తెలిపారు.

February 20, 2026 / 08:18 AM IST

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

CTR: మురకంబట్టు సమీపంలోని మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5, 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నజీర్బాను నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు https://apcfss.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 08:18 AM IST

యాగంటి ఉమామహేశ్వర స్వామికి విశేష పూజలు

NDL: బనగానపల్లె మండల పరిధిలో శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పాల్గొనమాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో పాండురంగారెడ్డి వేద పండితులు ఆధ్వర్యంలో స్వామికి రుద్రాభిషేకం కుంకుమార్చన ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. అలాగే నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు చేశారు.

February 20, 2026 / 08:12 AM IST