ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలక్షన్ టైమ్లో చాలా మంది రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అసలు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు కొండగట్టును సందర్శించిననున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ తొలిసారిగా అధికారిక హోదాలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి బయలు దేరి ఆలయానికి చేరుకోనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.
అమెరికాలో తెలుగు వారు అంతకంతకూ పెరుగుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగింతలు తెలుగువారి జనాభా పెరిగినట్లు యూఎస్ సెన్సస్ బ్యూరో చెబుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఈనాడు గ్రూప్ ఛైర్మెన్ దివంగత రామోజీ రావు సంస్మరణ సభను విజవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడు. ఆయన విగ్రహాన్ని నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం చేయడం, అడ్డుకున్నవాళ్లపై దాడి చేయడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
ఏపీ వాలంటీర్ల వ్యవస్థను సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ మంత్రి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్కు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ విషయమై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 29 కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఆ తరువాత పిఠాపురంలో పర్యటించనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈ కుండపోత వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఎక్కడెక్కడంటే?