• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మోదుమూడిలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఒకటో తేదీ ఆదివారం వచ్చే ప్రతి నెలా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు సొమ్ము పంపిణీ చేయిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిందన్నారు.

February 28, 2026 / 08:42 AM IST

సిద్ధవటంలో చిరుత సంచారం..!

KDP: సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.

February 28, 2026 / 08:41 AM IST

కిక్ బాక్సింగ్ విజేతకు నటుడి అభినందనలు

కోనసీమ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారికను నటుడు శివాజీరాజా అభినందించారు. శుక్రవారం రాజమండ్రిలో ప్రశంసించారు. మార్చి 4 నుంచి బెంగళూరులో జరగనున్న సౌత్ జోన్ పోటీల్లోనూ నిహారిక తన ప్రతిభను చాటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:40 AM IST

SVU పీజీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ / అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించించారు.

February 28, 2026 / 08:37 AM IST

రేపే జూలో చిత్రలేఖనం పోటీలు

VSP: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా రేపు జూలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్ వద్ద పోటీలు జరుగుతాయి. 1–5, 6–10 తరగతులు, ఇంటర్ నుంచి పీజీ వరకు మూడు విభాగాల్లో విద్యార్థులు పాల్గొనవచ్చు. వివరాలకు 94411 56344 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 28, 2026 / 08:33 AM IST

తెనాలి పంట కాలువలో మృతదేహం లభ్యం

GNTR: తెనాలి మండలం కంచర్లపాలెం శివారులోని పంట కాల్వలో సుమారు 50ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి,ప్రాథమిక విచారణలో మృతుడు యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు.

February 28, 2026 / 08:32 AM IST

అసెంబ్లీ సిబ్బందితో బాలయ్య ముచ్చట్లు

సత్యసాయి: ఏపీ అసెంబ్లీ కాఫీ సెక్షన్ సిబ్బందితో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదాగా గడిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి గ్రూపు ఫోటో దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, ఎంతో వినయంగా మెలిగే బాలయ్య వ్యక్తిత్వంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 28, 2026 / 08:30 AM IST

‘కార్మికుల అభ్యున్నతి కోసం గడపగడపకు’

PLD: క్రోసూరు:కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీల అభ్యున్నతి కోసం CPI పార్టీ పనిచేస్తుందని నియోజకవర్గ CPI కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు తెలిపారు. మార్చి ఒకటి నుంచి 15 వరకు మండలంలో గడపగడపకు CPI కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

February 28, 2026 / 08:30 AM IST

సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాదర్బార్లో ప్రజలు అందజేసిన అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు .

February 28, 2026 / 08:25 AM IST

ఇద్దరు MEOలు సస్పెండ్..!

KDP: ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

February 28, 2026 / 08:24 AM IST

ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయండి: కలెక్టర్

ELR: జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి‌సెల్వి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయాలన్నారు. రోడ్లపై పశువుల సంచారం విచ్చలవిడిగా ఉంటుందని వివరించారు.

February 28, 2026 / 08:22 AM IST

‘అధికారుల పర్యవేక్షణలో పింఛన్లు పంపిణీ చేస్తున్నాం’

VZM: రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు శనివారం NTR భరోసా ఫించన్ల పంపిణీ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేటగిరీల వారిగా లబ్ధిదారులకు పెన్షన్‌ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు.

February 28, 2026 / 08:22 AM IST

నేడు మున్సిపల్ సర్వసభ్య సమావేశం

PPM: సాలూరు పురపాలక సంఘం సాధారణ సర్వసభ్యు సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీ.రత్నకుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం కార్యాలయ కౌన్సిల్ హాలు వద్ద ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సంబధిత అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కౌన్సిలర్లకు సమాచారం అందించమని పేర్కొన్నారు.

February 28, 2026 / 08:20 AM IST

పింఛన్లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుంతకల్లులోని పలు వార్డుల్లో శనివారం సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. రేపు సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. పించన్ల పంపిణీలో సాంకేతిక లోపం వస్తే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

February 28, 2026 / 08:20 AM IST

‘తల్లిదండ్రులు బాధ్యతగా వ్యాక్సిన్ వేయించాలి’

E.G: మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని MP పురందేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు.

February 28, 2026 / 08:20 AM IST